కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు. మళ్లీ పార్టీకి తిరిగి వస్తే మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి ఆయననేననీ, పార్టీ శ్రేణులు అందరూ ఉప ఎన్నికల్లో తిరిగి గెలిపించుకుంటామని చెప్పారు రేవంత్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రలో భాగంగా శనివారం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ .. బీజేపీలో ఆ పార్టీ కండువా కప్పుకున్నప్పుడే పండుగ అని వ్యాఖ్యానించారు. బీజేపీ లో ఎల్కే అద్వానీ, వెంకయ్యనాయుడుల పరిస్థితి అందుకు నిదర్శనమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ మారి బీజేపీలోకి వెళ్లిన చాలా మంది సీనియర్ నేతలకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్న విషయం తెలుసుకోవాలన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ఎన్నికల ప్రచార పర్వంలో తప్పనిసరిగా పాల్గొంటారని తెలిపారు రేవంత్ రెడ్డి.
చౌటప్పల్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని విమర్శించారు. గెలిచిన ప్రతిపక్షాలకు చెందిన నేతలను తన పార్టీలో చేర్చుకునేందుకు కుట్రలు చేస్తుందని అన్నారు. మునుగోడులో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. వంద రోజుల సమయం ఉన్నందున మునుగోడు లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పథకాన్ని మనుగోడులో అందరికీ వర్తింపజేయాలని కోరారు. పార్టీ లు మారిన ఎంపీపీలు, సర్పంచ్ లు రాజీనామా చేయాలని కోరారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్, బీజేపీ లు రెండు తోడు దొంగలేనని రేవంత్ రెడ్డి విమర్శించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?