తెలంగాణ Telangana రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) PCC అధ్యక్ష పదవి ఎవరికి దక్కతుందో అన్న తీవ్ర చర్చ జరుగుతున్న వేళ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ manikyam Thakur దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. దుబ్బాక dubbaka ఉప ఎన్నికతో పాటు గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నిక ధ(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి uttam Kumar reddy రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ రెండు మూడు వర్గాలుగా ఏర్పడి పీసీసీ పదవికి నేతలు పోటీ పడ్డారు. ఇంతకు ముందు పీసీసీ అధ్యక్ష పదవికి తొలుత రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు వినపడగా తాజాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. రేవంత్ రెడ్డి వైపు పార్టీ అధిష్టానం సుముఖంగా ఉందని వార్తలు వచ్చిన వేళ వి హనుమంతరావుతో సహా పలువురు సీనియర్ నేతలు పార్టీ అధిష్టానానికి రేవంత్కు వ్యతిరేకంగా లేఖ కూడా రాశారు. పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ చార్జి పీసీసీ అధ్యక్ష ఎంపికపై దాదాపు 160మందికిపైగా నేతల అభిప్రాయాలను సేకరించి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, గ్రూపు రాజకీయాల నేపథ్యంలో పార్టీ సారధి ఎంపిక వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి.. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాతే పీసీసీని నియమించాలని ఇప్పటికే అధిష్టానానికి సూచించారు.
పీసీసీ విషయంలో తర్జనభర్జనలు, రోజుకు ఒక పేరు తెరపైకి రావడం పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం ఉప ఎన్నికల తరువాతే నియమించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ విషయాన్ని గురువారం మాణిక్యం ఠాగూర్ వెల్లడించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పూర్తి అయ్యే వరకూ ఉత్తమ కుమార్ రెడ్డే పీసీసీ అధ్యక్షుడుగా కొనసాగుతారని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల తరువాత కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించనున్నట్లు ఆయన ప్రకటించారు.
దుబ్బాక ఉప ఎన్నికలో ఘోర ఓటమిని చవి చూసిన కాంగ్రెస్ సాగర్ లోనైనా పరువు నిలుపుకోవాలని భావిస్తున్నది. సాగర్ ఉప ఎన్నికలో విజయం కోసం పార్టీ శ్రేణులు సమిష్టిగా పని చేస్తాయని ఠాగూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవానికి సాగర్ ఉప ఎన్నిక విజయం దోహదం చేస్తుందని ఠాగూర్ అభిప్రాయపడ్డారు.