TRS: టీఆర్ఎస్లో అంతర్గత గ్రూపు రాజకీయాల కారణంగా ఓ మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, సీఎం కేసిఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు అధికారంలో వచ్చింది. 2023 ఎన్నికల్లోనూ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి హాట్రిక్ సాధించాలన్న భావనలో టీఆర్ఎస్ ఉండగా, తెలంగాణలో అధికారమే లక్ష్యంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. అధికార పార్టీలో అసంతృప్తి నేతలను పార్టీలోకి చేర్చుకుని బలోపేతం అవ్వాలన్న ఆలోచనలో ఈ రెండు పార్టీలు ఉన్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
TRS: విభేదాలతోనే పార్టీ మార్పునకు నిర్ణయం
ఈ క్రమంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు కాంగ్రెస్ గాలం వేసింది. ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే ఓదేలు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని రాజకీయ వర్గాలకు తెలిసిన అంశమే. ఓదేలు భార్య నల్లాల భాగ్యలక్ష్మి మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్నారు. ఓదేలు చెన్నూరు నియోజకవర్గం నుండి 2009, 2010 ఉప ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018 ఎన్నికల్లో బాల్క సుమన్ టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ఆ తరువాత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య గ్రూపు విభేదాల నేపథ్యంలో ఓదేలు పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
TRS: రాహుల్ గాంధీ వద్దకు ఓదేలు
మాజీ ఎమ్మెల్యే ఓదేలును టీపీసీసీ అధ్యక్షుడు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్శింహా లు ఢిల్లీకి తీసుకువెళ్లారు. ఈ రోజు మధ్యానం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో వీరు భేటీ కానున్నారు. అక్కడ చర్చల అనంతరం రాహుల్ గాంధీ సమక్షంలోనే ఓదేలు కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరతారా..? లేక తరువాత హైదరాబాద్ వచ్చిన తరువాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో పార్టీ కండువా కప్పుకుంటారా..? అనేది సాయంత్రానికి తేలనుంది.