ఎన్నికల్లో గుర్తు ను పోలిన గుర్తులు పలు పార్టీల కొంప ముంచుతుంటాయి. అభ్యర్ధుల మధ్య కీన్ కంటెస్ట్ ఉన్న సమయంలో ప్రతి ఓటు పార్టీలకు కీలకమే. ప్రధాన ప్రత్యర్ధులతో నువ్వా నేనా అన్న పోటీ గానీ, త్రిముఖ పోటీ నెలకొన్న సమయంలో కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్ధులు తమ సత్తా చూపుతుంటారు. లేదా ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల గుర్తు పోలిన గుర్తు స్వతంత్ర అభ్యర్ధులకు వస్తే కొందరు నిరక్షరాస్యులు కన్ఫూజ్ అయి తాము ఓటు వేయాలని అనుకున్న అభ్యర్ధికి కాకుండా వేరే వాళ్లకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. గతంలో ఇలాంటి సందర్భాలు వెలుగు చూశాయి. అందుకే మునుగోడు ఉప ఎన్నిక దగ్గర పడుతున్న వేళ అధికార టీఅర్ఎస్ అప్రమత్తమైంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్ రాజ్ ను సోమవారం టీఆర్ఎస్ నేతలు కలిశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు ను పోలిన గుర్తులు ఎనిమిది ఉన్నాయనీ, వాటిని ప్రీ సింబల్స్ జాబితా నుండి తొలగించాలని టీఆర్ఎస్ నేతలు కోరారు. ఈ మేరకు టీఆర్ఎస్ నేతల బృందం సీఇఓకు వినతి పత్రం సమర్పించింది.
వినతి పత్రం అందజేసిన తర్వాత టీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడుతూ .. కారును పోలిన గుర్తులను ఇతర అభ్యర్ధులకు కేటాయిస్తుండటంతో తమ పార్టీకి నష్టం జరుగుతోందని అన్నారు. గతంలో కారును పోలిన గుర్తులు కారణంగా టీఆర్ఎస్ కు ఓటు వేయాలని అనుకున్న కొందరు ఆ గుర్తుకు ఓటు వేశారనీ, ఆ ఫలితంగా తమ పార్టీ అభ్యర్ధులకు రావాల్సిన ఓట్లు కారను పోలిన గుర్తు కల్గిన అభ్యర్ధులకు పడ్డాయని తెలిపారు. ఈ తరహా పరిస్థితులు పునరావృత్తం కాకుండా ఉండేందుకు గానూ ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తులను ప్రీ సింబల్స్ జాబితా నుండి తొలగించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగిందని చెప్పారు. గతంలోనూ సీఈసీని కలిసి ఈ సమస్యను విన్నవించింది టీఆర్ఎస్. తాజా వినతి పత్రంతో ఎన్నికల సంఘం స్పందిస్తుందో లేదో వేచి చూడాలి.
Russia-Ukraine War: రాజధాని కైవ్ సహా ఉక్రెయిన్ నగరాలపై క్లిపణుల వర్షం కురిపిస్తున్న రష్యా..