TRS MLA Poaching Case: దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో సంచలనం రేపిన తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే ఎత్తివేసిన నేపథ్యలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసు దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి రవి గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సీపీ ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంలో సభ్యులుగా నల్లొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ కల్మేశ్వర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, నారాయణపేట ఎస్పీ వేంకటేశ్వర్లు,. రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ సీఐ లక్ష్మీరెడ్డి లు ఉన్నారు.
మరో పక్క హైకోర్టు స్టే ఎత్తివేసిన తరుణంలోనే ముగ్గురు నిందితులను కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా, బుధవారం విచారణ జరిపింది. మొయినా బాద్ ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలునకు బేరసారాలు జరిపిన నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలను అయిదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరగా, కోర్టు సానుకూలంగా స్పందిస్తూ నిందితులను రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది.
అయితే ఇప్పటికే ప్రభుత్వం పోలీస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో మొయినాబాద్ పోలీసుల నుండి దర్యాప్తు అంతా సిట్ చేతిలోకి వెళ్లనుంది. రేపు నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకుని సిట్ బృందం ఆద్వర్యంలో విచారణ జరపనున్నారు. ఈ కేసులో ఓ పక్క ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం, మరో పక్క కస్టడీ విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడం ఇలా రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Breaking: తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యే రాజాసింగ్ కు బిగ్ రిలీఫ్
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?