TRS MLAs poaching case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫోన్ టాపింగ్ జరిగిందని ఆరోపిస్తూ మంగళవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తంగెళ్ల శివ ప్రసాదరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు విచారణ కు స్వీకరించింది. ఎమ్మెల్యేలు, సామాన్యుల ఫోన్ లు తెలంగాణ ప్రభుత్వం టాప్ చేస్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 5(2) నిబంధనలు ఉల్లంఘించి ఫోన్ ట్యాప్ చేశారని పిటిషనర్ తెలిపారు. ఫోన్ టాప్ లు చేయడం వల్లనే రీసెంట్ గా జరిగిన ఫామ్ హౌస్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర విచారణకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. కాగా ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి సీబీఐ విచారణ కోరుతూ ఇంతకు ముందే బీజేపీ వేసిన పిటిషన్ తో కలిపి ఈ పిటిీషన్ ను నవంబరం 4వ తేదీన విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. మరో పక్క ఫోన్ టాపింగ్ అంశంపై బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
అమరావతి రైతుల మహా పాదయాత్రపై ఏపి హైకోర్టులో ఇరుపక్షాలకు చుక్కెదురు