TRS: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా చేసిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం ఇప్పుడు చర్చల్లో నిలుస్తోంది. తాజాగా అక్కడ పర్యటించి ఈ సందర్భంగా జరిగిన సోషల్ మీడియా వారియర్స్ సమ్మేళనంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2001నుండి కమలాపూర్ నియోజక వర్గం గులాబీ కంచు కోట. ఇప్పుడు కూడ గులాబీ కంచు కోటా లాగే ఉండాలన్నారు.
Read More: Eatela Rajendar: ఈటల విషయంలో కేసీఆర్ ఎక్కువ పరేషాన్ అవుతున్నది ఎందుకంటే…
అబద్దాలు ప్రచారం చేస్తున్నారు..
సోషల్ మీడియా లో అబద్దాలు ప్రచారాలు చేయడంలో బీజేపీ దిట్ట అని బాల్క సుమన్ ఆరోపించారు. బీజేపీ చెప్పే ఆబద్దాలకు టీఆర్ఎస్ పార్టీకి మధ్య పోటీ జరుగుతుందని పేర్కొన్నారు. “ 2001లో కేసీఆర్ నాయకత్వంలో టీఆరెఎస్ పార్టీ పురుడు పోసుకుంది. డిల్లీ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. రాష్ట్రం వచ్చిన తర్వాత నా లాంటి వాళ్లను కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులను చేసిండు. ఈటల రాజేందర్ అనే సామాన్యుడిని తీసుకు వెళ్లి ఇంట్లో పెద్ద కొడుకు లెక్క పెంచుకున్నడు కేసీఆర్. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి పని చేయకుండా అవతలోడికి పని చేసిన వ్యక్తి ఈటెల. ఆర్టీసీ కార్మికులతో సమ్మె చేపించిండు. ఆ కార్మిక సంఘం నాయకుడు అశ్వత్థామ రెడ్డి ఇప్పుడు ఈటెల వెంబడి ఉన్నడు. ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ప్రభుత్వ పథకాలను విమర్శించిండు. పుణె, బెంగుళూర్ లో పార్టీ వ్యతిరేక మీటింగ్ లు పెట్టుకున్నడు“ అంటూ విరుచుకుపడ్డారు.
Read More: Revanth Reddy: ఏంటిది రేవంత్ … డబ్బా కొట్టుకోవడం అని అనుకుంటారు
ఔను బానిసనే!
తనను భానిస సుమన్ అంటూ కొందరు విమర్శిస్తున్నారని బాల్క సుమన్ పేర్కొన్నారు. “ నేను ప్రజలకు భానిసను. నా పార్టీకి కట్టు భానిసను. అవును గర్వంగా చెప్పుకుంటున్నా. కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణ ప్రజల నడ్డి విరుస్తుంది అంటివి కదా రాజేందర్ అన్న. నీకన్న పార్టీలో సీనియర్లు కొప్పుల ఈశ్వర్, నారదాసు లక్ష్మణ్ రావులు ఉన్నరు. వారు ఎప్పుడు పదవుల కోసం ఆలోంచిచలేదు. కాని ఈటల అన్ని పదవులు అనుభవించుండు.’’ అని ఈటలపై బాల్క సుమన్ ఫైర్ అయిండు.