Ban On Private Practice: ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసు విషయంలో కేసిఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై ప్రభుత్వం నిషేదం విధించింది. ఈ మేరకు మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ నిబంధనల సవరణ తీసుకువచ్చింది. ప్రైవేటు ప్రాక్టీసు నిషేదిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో 56ను విడుదల చేసింది. ప్రైవేటు ప్రాక్టీసు నిషేదం కొత్తగా ఉద్యోగాల్లో చేరే వైద్యులకు మాత్రమే వర్తిస్తుంది. కొత్తగా సర్కార్ దవాఖానాల్లో చేరే వైద్యులు ఇక ప్రైవేటు ప్రాక్టీసు చేయడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సర్కార్ దవాఖానాల్లో పని చేస్తున్న ఎక్కువ మంది వైద్యులు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువ సమయం ఉండటం, ప్రైవేటు ప్రాక్టీసుకే ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రీసెంట్ గా ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రిల్లో ఖాళీగా ఉన్న 12,755 వైద్య సిబ్బంది (వైద్యులు, స్టాఫ్ నర్స్, ఎఎన్ఎంలు, పారా మెడికల్ స్టాఫ్) భర్తీకి చర్యలు చేపడుతోంది. ఈ నియామకాల సమయంలోనే ప్రభుత్వ వైద్యుల విషయంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.