Ts High court: ఓటుకు నోటు కేసులో ఎంపి రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి పై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓటుకు నోటు కేసు అవనీతి నిరోధక శాఖ కోర్టు పరిధిలోకి రాదనీ, ఎన్నికలకు సంబంధించిన వివాదాలకు అవినీతి నిరోధక చట్టం వర్తించదంటూ రేవంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు రేవంత్ రెడ్డి వాదనలను తోసిపుచ్చింది. రేవంత్ పిటిషన్ ను కొట్టివేసింది. రేవంత్ రెడ్డి ఇటీవలే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా చార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే.