రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడవల్లి గ్రామంలో శాలిని అనే యువతి కిడ్నాప్ వ్యవహారం తీవ్ర కలకలాన్ని రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కిడ్నాప్ అంతా ఓ పెద్ద డ్రామా అని తర్వాత తేలిపోయింది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆ యువతీ యువకుడు కిడ్నాప్ డ్రామా ఆడారు. తండ్రికి బిగ్ షాక్ ఇచ్చింది షాలిని. గ్రామానికి చెందిన శాలిని అనే యువతి తన తండ్రితో కలిసి మంగళవారం వేకువజామున గ్రామంలో హనుమాన్ ఆలయంలో పూజ చేయడానికి వెళ్లింది. గుడిలో పూజల అనంతరం తండ్రితో కలిసి బయటకు రాగా ఆ యువతిని కిడ్నాప్ చేసేందుకు ఆలయం వద్ద అప్పటికే కొందరు యువకులు యువతి తండ్రిని పక్కకు తోసి వేసి శాలిని ని బలవంతంగా కారులోకి ఎక్కించి తీసుకువెళ్లారు.
ఈ ఘటనతో ఒక్క సారిగా నిచ్చేష్టుడైన యువతి తండ్రి.. కారును ఆపేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. వెంటనే కారును పట్టుకునేందుకు బైక్ పై అనుసరించినా కారు వేగంగా వెళ్లిపోయింది. దీంతో ఆ యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా నిందితులను గాలించే పనిలో పోలీసులు పడ్డారు. తన కుమార్తె కిడ్నాప్ వెనుక గ్రామానికి చెందిన కటారపు జాన్ ప్రమేయం ఉండవచ్చని శాలిని తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయం వద్ద సీసీ టీవీ పుటేజ్ లో యువతిని కిడ్నాప్ చేయడం స్పష్టంగా రికార్డు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే కిడ్నాప్ కు గురైన యువతి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఆ యువతి తాము వివాహం చేసుకున్నట్లుగా వీడియో విడుదల చేసింది. తాము ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నామని తెలిపింది. తాను ప్రేమించిన యువకుడు జ్ఢానేశ్వర్ అలియాస్ జాని దళితుడు కాబట్టే తమ ఇంట్లో వివాహానికి ఒప్పుకోవడం లేదని శాలిని చెప్పింది. పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరనే కిడ్నాప్ ప్లాన్ చేసినట్లుగా వెల్లడించింది. ఏడాది క్రితమే తాము ఇంట్లో నుండి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నామనీ అయితే అప్పుడు తాను మైనర్ ను కావడం వల్ల పెళ్లి చెల్లలేదనీ, తన తల్లిదండ్రుల ఫిర్యాదుపై అప్పుడు జాని పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారన్నారు. ఇప్పుడు తనకు మైనార్టీ తీరడంతో ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నామనీ, ఎవరి బలవంతం లేదని ఆమె తెలిపింది. తన తల్లిదండ్రుల నుండి ప్రమాదం ఉన్నందున పోలీసులు రక్షణ కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వీడియోను విడుదల చేసింది. దీంతో కిడ్నాప్ ఉదంతం సుఖాంతం అయ్యింది.
దటీజ్ విజయసాయి అనాల్సిందే(గా)..! మరో సారి రాజ్యసభ ప్యానెల్ వైస్ చైర్మన్ గా అవకాశం..