Fire Accident: మెదక్ జిల్లాలో తీవ్ర విషాదకర సంఘటన జరిగింది. ప్రమాద వశాత్తు గ్యాస్ సిలెండర్ పేలడంతో ఓ వృద్దురాలితో పాటు ఆరేళ్ల మనుమరాలు సజీవ దహనం అయ్యారు. సిలెండర్ పేలుడు ధాటికి ఇళ్లు ధ్వంసమైంది. మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్నశివనూర్ గ్రామంలోని ఓ ఇంట్లో ప్రమాద వశాత్తు గ్యాస్ సిలెండర్ పేలింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అంజమ్మ, మధు మృతి చెందినట్లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇటీవల కాలంలో గ్యాస్ సిలెండర్ ప్రమాదాలు అక్కడక్కడా చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా అజాగ్రత్త, నిర్లక్ష్యం కారణంగా సిలెండర్ ప్రమాదాలు జరుగుతున్నాయని సమాచారం. మూడు రోజుల క్రితం హైదరాబాద్ హకీంపేటలో ఓ స్టవ్ రిపేరు షాపులో గ్యాస్ సిలెండర్ పేలుడు కలకలాన్ని రేపింది. పెద్ద సిలెండర్ (కమర్షియల్ సిలెండర్) నుండి గృహ వినియోగదారుల సిలెండర్ (డొమిస్టిక్) లోకి గ్యాస్ నింపుతున్న క్రమంలో ఒక్క సారిగా ప్రమాదం సంభవించింది. భారీ పేలుడు శబ్దంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అందుకే గ్యాస్ సిలెండర్ వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కంగన రానౌత్ కుషీ ..కుషీ.. అభిమానులు కూడా.. ఎందుకంటే..?