తెలంగాణలో గత కొంతకాలంగా అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్దం జరుగుతోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న నేపథ్యంలో బీజేపీ వ్యవహారాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన బీజేపీ కేంద్ర కార్యవర్గ సమావేశంలోనూ మీడియా ముసుగులో ఇంటెలిజెన్స్ అధికారులు ఎంటర్ కావడంపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. తాజాగా బీజేపీ కార్యాలయంలోకి ఇంటెలిజెన్స్ అధికారులు రావడంపై ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మరో సారి ఆఫీసుకు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు వస్తే ఊరుకునేది లేదని కిషన్ రెడ్డి హెచ్చరించారు. అనుమతి లేకుండా కార్యాలయంలోకి ఎలా వస్తారంటూ నిలదీశారు కిషన్ రెడ్డి.
ఇదే సందర్భంగా కిషన్ రెడ్డి చేసిన సీనియర్ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఫోన్లు ట్యాప్ చేస్తుంది చాలదా.. ఇంకా ఆఫీసుకు వచ్చి ఏమి సమాచారాన్ని సేకరించాలని కిషన్ రెడ్డి ఇంటెలిజెన్స్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే తాము ప్రగతి భవన్, తెలంగాణ భవన్ లో ఐబీ అధికారులను పెట్టాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తూ, ఇందుకు సీఎం అంగీకరిస్తారా అని కిషన్ రెడ్డి నిలదీశారు. నిజంగా బీజేపీ నేతల ఫోన్ లు ట్యాపింగ్ జరుగుతుంటే కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా.. అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఆరోపణలు రాజకీయంగా చేస్తున్నారా లేక నిజంగా జరుగుతుందా అనేది తేలాల్సి ఉంది. కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన వివరణ ఇస్తుందో వేచి చూడాలి.
తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా ప్రత్యేక సమావేశం.. ఆ అంశాలపై చాలా స్ట్రాంగ్ గా..