ఖమ్మం జిల్లా వైరా పట్టణానికి చెందిన బీజెపీ నేత నేలవెళ్లి రామారావును గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన పట్టణంలో తీవ్ర కలకలాన్ని రేపింది. శనివారం ఆయనపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కుటుంబ సభ్యుల సమచారంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక పరమైన లావాదేవీల కారణంగానే రామారావుపై ప్రత్యర్థులు దాడి చేసి హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.