Vijayasanthi: బీజేపీ కీలక నాయకురాలు విజయశాంతి రీసెంట్ గా ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సొంత రాజకీయ పార్టీ ఆ తర్వాత టీఆర్ఎస్ లో విలీనం చేయడం, ఆ పార్టీ నుండి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ను విబేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపెయినర్ గా కూడా ప్రచారం చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. తాజాగా ఆ పార్టీ వ్యవహార శైలికి నచ్చక మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆమె పార్టీ మళ్లీ మారారంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలను ఆమె ఖండించారు. బీజేపీని ఎందుకు వీడి కాంగ్రెస్ పార్టీకి వెళ్లాల్సి వచ్చిందో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వివరించారు.
“రాములమ్మ పార్టీ మారారు అని విమర్శించే వాళ్ళు ఒక్కటి తెలుసుకోవాలి. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు 7 సంవత్సరాలు జెండా మోసి కొట్లాడింది నేను నాడు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, ఇంకొందరు బీజేపీ ప్రముఖులు అనేక సార్లు తమంత నా వద్దకు వచ్చి టిఆర్ఎస్ అవినీతిపై తప్పక చర్యలుంటాయి, మీరందరూ సమర్థిస్తే కేంద్రంలోని బీజేపీ ఎంతవరకైనా కొట్లాడతది అని చెప్పి నన్ను, వివేక్ వెంకటస్వామి గారిని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఒప్పించి, అందుకు కేంద్ర పెద్దలతో హామీ ఇప్పించి చేర్చుకున్నది నిజం కాదా…?’ అని ప్రశ్నించారు.
‘రాష్ట్రంలోని దుర్మార్గ పాలన పోవాలి, మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బాగుంటే చాలు అన్న ఒకే ఒక్క కారణంతో సంవత్సరాలుగా పనిచేసిన కాంగ్రెస్ ను వదిలి బిజేపికి వెళితే మాట నిలబెట్టుకోక మమ్మల్ని మోసగించి బీఆర్ఎస్ తో బీజేపీ అవగాహన పెట్టుకున్నది తెలిసి కదా ఇంతమంది నాయకులు రాజీనామాలు చేసి బయటకెల్లింది..? విమర్శ తేలిక.. ఆత్మ పరిశీలన అవసరం’ అని పేర్కొన్నారు.
JP Nadda: ‘కేసిఆర్ ను కటకటాల వెనక్కు పంపుతాం’