YS Sharmila Parigi tour: వికాబారాద్ జిల్లా పరిగి పర్యటనకు బయలుదేరిన వైఎస్ షర్మిల కాన్వాయ్ని పోలీసులు అడ్డుకున్నారు. పరిగి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్ల తీరును పరిశీలించేందుకు గానూ షర్మిల హైదరాబాద్ నుండి వెళుతుండగా చింతపల్లి వద్దకు చేరుకోగా షర్మిల కాన్వాయ్ ని పోలీసులు నిలిపివేశారు. కోవిడ్ నిబంధనల కారణంగా షర్మిల కాన్వాయ్ లో రెండు వాహనాలకే అనుమతి ఉందని పోలీసులు పేర్కొన్నారు. షర్మిల కాన్వాయ్ వాహనాలను నిలుపుదల చేయడం పట్ల పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు అయిదు వాహనాల చొప్పున అనుమతించారు. దీంతో అక్కడ కొద్ది సేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
షర్మిల పరిగి నియోజకవర్గ పరిధిలోని దోమ మండలంలోని పాలెపల్లి ఐకేపీ సెంటర్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించేందుకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారనీ, వారిని అడ్డుకుంటామని టీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్న కారణంగా ఐకేపీ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read More: MP RRR Vs Ys Jagan: సీఎం జగన్ కు రెబల్ ఎంపి రఘురామ మరో లేఖాస్త్రం.. ఇదేమిటంటే
పరిగి పర్యటనలో భాగంగా షర్మిల రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. రైతుల సమస్యలను తెలుసుకొని వాటిపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు.