YS Sharmila Party: తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా రాజకీయ అరంగ్రేటం చేసిన వైఎస్ షర్మిల పార్టీ ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ ఏడాది మార్చి నెలలోనే రాజకీయ పార్టీ పెడుతున్నట్లు షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ జిల్లాలలోని ముఖ్యనేతలతో సమావేశాలను నిర్వహించిన షర్మిల ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు చేస్తూ రాజశేఖరరెడ్డి హాయంలో అమలు జరిగిన సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తున్నారు. మరో పక్క కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ పనులను పూర్తి చేశారు. ఈ సందర్భంగా పార్టీ ప్రారంభోత్సవ విషయాలపై పార్టీ సమన్వయకర్త వాడుక రాజగోపాల్ నేడొక ప్రకటన విడుదల చేశారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి జూలై 8 నాడు షర్మిల పార్టీని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ ఆవిర్భావానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు, కార్యక్రమాలన ఇప్పటికే ప్రారంభించామన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్ టీపీ)కి సంబంధించిన ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియ పనులు అన్నీ పూర్తి అయినట్లు తెలిపారు. పార్టీ పేరుపై వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకి ఎటువంటి అభ్యంతరం లేదన్నట్లుగా, తమ పార్టీ పేరుకు మద్దతుగా ఎన్నికల సంఘానికి ఇచ్చిన లేఖను అందజేశామని పేర్కొన్నారు.
Read More: Anandaiah Medicine: కృష్ణపట్నం ఆనందయ్య కీలక వినతి ..! బాధితులకు షాకింగ్ న్యూస్ ఇదీ..!!
పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా పార్టీ పేరుపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఎన్నికల సంఘం ఏప్రిల్ 30న తన వెబ్ సైట్ లో పేర్కొందని, ఇప్పటి వరకూ ఎలాంటి అభ్యంతరాలు రానందు వల్ల అనుమతుల ప్రక్రియ పూర్తి అయ్యిందని భావిస్తున్నామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నుండి అధికారికంగా అనుమతి పత్రాలు రాగానే పార్టీకి సంబంధించి అన్ని వివరాలు ప్రకటిస్తామని వాడుక రాజగోపాల్ తెలిపారు.