YS Sharmila : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల రాజకీయ పార్టీపై కీలక నిర్ణయం వెలువడించనున్న నేపథ్యంలో హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద వైఎస్ఆర్ అభిమానుల కోలాహాలం నెలకొంది. షర్మిల నాయకత్వం వర్దిల్లాలి అంటూ పెద్ద ఎత్తున వాల్ పోస్టర్లు అక్కడ వెలిశాయి. అయితే ఈ ఫ్లెక్సీల్లో షర్మిల సోదరుడు, ఏపి సీఎం వైఎస్ జగన్ ఫోటో గానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పేరు గానీ లేకపోవడం గమనార్హం. ఫ్లెక్సీలపై వైఎస్ఆర్, షర్మిల ఫోటోలు మాత్రమే కనిపించాయి. ఫ్లెక్సీలపై జగన్ ఫోటో లేకపోవడంపై వైసీపీ అభిమానులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వస్తున్నాయి.
ఫ్లెక్సీల్లో “మన కష్టం తెలుసు.. మన కన్నీళ్లు తెలుసు.. మన బతుకులు మార్చే బాట, వైఎస్ఆర్ కుటుంబానికి తెలుసు, షర్మిలమ్మ నాయకత్వం వర్దిల్లాలి” అంటూ ఉంది. అదే విధంగా “జనంలోకి వస్తుంది షర్మిలక్క..జనరంజక పాలన మందుందిక” అని మరో ఫ్లెక్సీలో ఉంది.
నేడు జరిగే సమావేశానికి వైఎస్ తో అనుబంధం ఉన్న నేతలను సమావేశానికి రావాలని ఇప్పటికే షర్మిల ఆహ్వానించారు. దీంతో తెలంగాణ ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో అభిమానులు లోటస్ పాండ్ కు చేరుకున్నారు. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టబోతున్నారని కొద్ది రోజులుగా ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలోనే కొత్త పార్టీ పై కార్యకర్తలతో షర్మిల చర్చించనున్నారని టాక్. తెలంగాణలోని అన్ని జిల్లాల వారీగా షర్మిల సమావేశాలు జరుపుతారని అంటున్నారు.
Jai Sharmila. Ysr cp pic.twitter.com/zZJ6r8YVLj
— Govind Dhangar Ysr (@GovindYsr) February 9, 2021