YS Sharmila: విద్యా వ్యవస్థను కేసిఆర్ సారు బ్రష్టుపట్టిస్తున్నారని వైెఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైెఎస్ షర్మిల విమర్శించారు. ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా వైెఎస్ షర్మిల విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. వివిధ పత్రికల్లో సమస్యలపై వచ్చే కథనాలకు నిత్యం వైెఎస్ షర్మిల స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తెలంగాణలోని యూనివర్శిటీల్లో ఫ్రొఫెసర్ల కొరతపై వచ్చిన కథనాన్ని షర్మిల పోస్టు చేస్తూ కేసిఆర్ తన ఎజెండాను ఈ విధంగా అమలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. విద్యను ప్రజలకు దూరం చేయడం వల్ల కేసిఆర్ సర్కార్ కు వచ్చే ప్రయాజనాన్ని వివరిస్తూ అందుకే కేసిఆర్ విద్యావ్యవస్థను బ్రష్టు పట్టిస్తూ తన ఎజెండాను అమలు చేస్తున్నారని షర్మిల వ్యాఖ్యానించారు.
‘చదువు చెప్పేటోడు లేకుంటే చదువుకునేటోడు ఉండడనీ, చదువులేకపోతే ప్రశ్నించే టోడు ఉండడనీ, కొలువులు అడిగేటోడు ఉండడనీ, బడులు బంద్ పెట్టి..యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లను నియమించకుండా.. విజ్ఞానాన్ని దూరం చేస్తూ ..KCR గారు .. తన ఎజెండాను 100 కు100 శాతం అమలు చేస్తున్నారు’ అని విమర్శించారు షర్మిల.
రాష్ట్రంలో మొత్తం 11 యూనివర్శిటీల్లో ఏడు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు 100 కు 100% లేరనీ, ఒక్క ఉస్మానియా తప్పితే మిగిలిన వాటిలో 90% బోధన సిబ్బంది ఖాళీనేనన్నారు. యూనివర్సిటీల్లో 2837 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటే, 1867 పోస్టు లను భర్తీ చేయకుండా విద్యా వ్యవస్థను కేసిఆర్ సారు భ్రష్టు పట్టిస్తున్నాడని షర్మిల ట్వీట్ చేశారు.
Read More:
1.MP Komatireddy: కాంగ్రేస్ ఎంపి కోమటిరెడ్డిపై క్రమశిక్షణా చర్యలు..?
2.PDS Rice: ఏపి గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాధరాజు సంచలన వ్యాఖ్యలు..!!
3.Election commission of India: హూజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇదీ..