KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనపై YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కామెంట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. గత కొద్దికాలంగా ఉద్యోగా భర్తీ విషయంలో స్పందిస్తున్న షర్మిల తాజాగా కసీఆర్ చేసిన వ్యాఖ్యల గురించి రియాక్టయ్యారు. టీఆర్ఎస్ ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదని, పూర్తిగా రాజకీయ పార్టీ అని సీఎం కేసీఆర్ తాజాగా స్పష్టం చేయడంపై షర్మిల సెటైర్లు వేశారు. TRS ఫక్తు రాజకీయ పార్టీ అని కేసీఆర్ చెప్పేయడంతో అయినా ఆ పార్టీ తీరు గ్రహించాని చెప్పారు. ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఏదో ఒక పథకాన్ని తీసుకొస్తాం తప్ప… ప్రజల అభివృద్ధి మాత్రం మాకు పట్టలేదు అని చెప్పినందుకు చాలా సంతోషమని షర్మిల ఎద్దేవా చేశారు.
Read More : KCR: దళితబంధు గురించి భలే కవర్ చేసిన కేసీఆర్
షర్మిల ఏమంటున్నారంటే…
జనాలను మోసం చేస్తూ గెలుస్తున్నామని ఇప్పటికైనా కేసీఆర్ చెప్పారని షర్మిల ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పాలనలో ఎన్నికలు ఉంటేనే పథకాలు వస్తాయని, ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని… ఈ విషయాన్ని ప్రజలు ఇప్పటికైనా ప్రజలు గమనించాలని షర్మిల అన్నారు. . మీ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మీ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించండని షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలు వస్తేనే కేసీఆర్ దృష్టి మీ ప్రాంతంపై పడుతుందని.. ఎన్నికల్లో గెలిచేందుకు కొత్త పథకాలను తీసుకొస్తారని, ఎన్నికల్లో గెలిచాక హామీలను మళ్లీ మూలకు పడేస్తారని షర్మిల ఆరోపించారు.
Read More : KCR: కేసీఆర్ ఇంకో వరాల జల్లు… ఈసారి బీసీల వంతు.
కేసీఆర్ ఏమన్నారంటే…
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన హుజురాబాద్ నియోజకవర్గం నేత కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆసక్తికర కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. తాము రాజకీయం చేస్తున్నారని అంటున్నారని, రాజకీయ పార్టీగా రాజకీయం చేయకుండా మరేం చేస్తారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపైనే తాజాగా షర్మిల సెటైర్లు వేశారు.