YS Sharmila: తెలంగాణ Telangana లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో కేసిఆర్ KCR సర్కార్ లాక్ డౌన్ LOCKDOWN ఆంక్షలను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. పార్క్ లు, జిమ్ లు, బార్లు, మాళ్ళు, సినిమా హాళ్లు అన్ని తెరుచుకోవచ్చు అంటూ ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. అదే విధంగా జూలై 1 నుండి విద్యా సంస్థలు కూడా తెరవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో విద్యాశాఖ జూలై 1 నుండి పాఠశాలలను తెరిచేందుకు చర్యలు చేపడుతోంది. అయితే విద్యాసంస్థలను తెరిచే నిర్ణయాన్ని వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల తప్పుబట్టారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Read More: Viral Video: ఛత్తీస్గడ్లో అమానవీయ ఘటన ..! సర్పంచ్తో సహా పది మందిపై అట్రాసిటీ కేసు..!!
కోవిడ్ థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పాఠశాలలు తెరిస్తే పిల్లలు కరోనా బారిన పడే ప్రమాదం ఉందని వై ఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకూ పాఠశాలలను ప్రారంభించవద్దని షర్మిల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాఠశాలలు తెరిచి పిల్లల ప్రాణాలతో ఆడుకోవద్దని షర్మిల కోరారు. ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తి అయ్యే వరకూ బడులు తెరిచే ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. వైఎస్ షర్మిల విజ్ఞప్తిపై కేసిఆర్ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.
తెలంగాణలో త్వరలో పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్న వైఎస్ షర్మిల నిత్యం ఏదో ఒక సమస్యపై స్పందిస్తున్నారు. కేసిఆర్ సర్కార్ పై ఆరోపణలు, విమర్శలు సంధిస్తూనే ఉన్నారు. షర్మిల జిల్లాల పర్యటనలు చేస్తున్నారు.