YS Sharmila: తెలంగాణ రాజకీయాల్లో తన ముద్ర వేసుకోవాలని చూస్తున్న వైఎస్ షర్మిల ఈ మేరకు తన ప్రయత్నాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి మంగళవారం నిరుద్యోగవారం – నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వంపై ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే, ఈ ఒరవడికి కొనసాగింపుగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివాసీల పోడుభూములపై దృష్టి సారించారు.
Read More : KCR: దళితబంధు కేసీఆర్ కు బెడిసికొడుతోందా?
వరంగల్ లో పర్యటన
నిరుద్యోగుల సమస్యలపై గలం విప్పడంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాద్ నియోజకవర్గం, గూడూరు మండలం, సోమ్లా తండా గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి బోడ సునీల్ నాయక్ కుటుంబాన్ని వైయస్ షర్మిల పరామర్శించనున్నారు. గుండెంగి గ్రామంలో YSR తెలంగాణ పార్టీ అధినాయకురాలు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు “నిరుద్యోగ నిరాహార దీక్ష“ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైయస్ఆర్ అభిమానులు హాజరవుతారని పార్టీ పేర్కొంది.
Read More: KCR: కేసీఆర్ మరిన్ని వరాలు… నేడే ప్రకటన
అంతటితో ఆగకుండా…
నిరుద్యోగుల సమస్యలతోనే ఆగిపోకుండా పోడు భూముల పరిష్కారం కోసం, పోడు రైతులకు భరోసా ఇవ్వడానికి సైతం షర్మిల ముందుకు సాగుతున్నారు. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు బుధవారం ములుగు జిల్లాలో “పోడుభూములకై పోరు” కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఉదయం 11గంటలకు ములుగులోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయనున్నారు. అనంతరం పస్రా గ్రామంలోని కొమురం భీం విగ్రహానికి నివాళి అర్పించి, లింగాల గ్రామం వరకు భారీ ర్యాలీ చేపట్టనున్నారు. లింగాలలో “పోడుభూములకై పోరు” కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైయస్ఆర్ అభిమానులు, ఆదివాసీ గిరిజనులు హాజరవుతారని తెలిపారు.