YSR : దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకున్న చివర ముఖ్యమంత్రి అని అందరికీ తెలుసు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం కొద్ది నెలల్లోనే ఆయన మరణించడం ఆ తర్వాత తెలుగు రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకోవడం మాత్రమే కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విభజించడం జరిగింది.
ఆయన మరణం పట్ల చాలామంది నాయకులు మరియు ప్రజలు బాధపడటమే కాకుండా కొంతమంది ఆయన మరణాన్ని తట్టుకోలేక మరణించిన వాళ్లు కూడా ఉన్నారు. పార్టీలకతీతంగా వైయస్ రాజశేఖర రెడ్డిని అభిమానించే నాయకులు చాలామంది ఉన్నారు. ఈ కోవలోనే తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ బిజెపి నేత స్వామి గౌడ్ ఒకరు. ఈ విషయాన్ని తాజాగా ఓ ప్రముఖ వెబ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన సమయంలో తన తండ్రి చనిపోయిన దాని కంటే ఎక్కువ ఏడ్చినట్లు పేర్కొన్నారు. ఆయన రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడైనా గాని ఎక్కడ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ అనేది లేకుండా వ్యవహరించేవారిని అందుకే ఆయన అంటే అభిమానం అని పేర్కొన్నారు. ఎవరు తప్పు చేసిన వెంటనే మందలించే వారిని ప్రాంతాలకతీతంగా ఆయన పరిపాలన ఉండేది అంటూ బీజేపీ నేత స్వామి గౌడ్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పై తనకున్న అభిమానాన్ని తాజాగా బయటపెట్టారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?