Ysrcp: వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందంటూ ఓ సెక్షన్ మీడియా గత కొద్ది రోజులుగా పేర్కొంది. సర్వే సంస్థల రిపోర్టు అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. గత నెల చివరిలో ఓ సర్వే సంస్థ ఇచ్చిన నివేదికలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ..ఏకంగా 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఓటమి తప్పదనీ, మరో 20 మంది అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్న పోటీ పేర్కొంది. పరాజయం పాలయ్యే అవకాశం ఉన్న 60 మందిలో ఏకంగా 9 మంది మంత్రులు కూడా ఆ సర్వే తెలిపింది. అయితే ఈ సర్వే లో వచ్చిన ఫలితాలకు కారణమేమిటన్న కోణంలో సీఎం జగన్ బృందం ఆరా తీస్తున్న నేపథ్యలో తాజాగా లోకల్ యాప్ సర్వే పేరట విడుదల అయిన అంశాలు వైసీపీ శిబిరాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. అదే విధంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరాజయం పాలయ్యే అవకాశాలు ఉన్న మంత్రుల సంఖ్య 9 నుండి 11 కు చేరిపోయింది. సమయం పెరిగే కొద్దీ పరాజయం పాలయ్యే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రుల సంఖ్య పెరిగిపోతుండట ఆ పార్టీని తీవ్ర కలకలాన్ని రేపుతున్నట్లు సమాచారం.
Ysrcp: రెండేళ్లలో నాలుగు శాతం ఓట్లు లాస్
2019 ఎన్నికల్లో వైసీపీకి 49.95 శాతం ఓట్లు వచ్చాయి. వైసీపీకి 50 శాతం మేర అంటే మొత్తం ఓట్లలో సగం మేర ఓట్లు వచ్చినట్లు లెక్క. ఇప విపక్ష టీడీపీకి కేవలం 39.93 శాతం ఓట్లు వచ్చాయి. 151 అసెంబ్లీ సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ కేవలం 23 సీట్లతో విపక్షానికి పరిమితం అయ్యింది. టీడీపీకి వచ్చిన ఓట్ల మధ్య తేడా కేవలం 10 శాతం మాత్రమే. ఈ పదిశాతం ఓట్ల తేడాతోనే ఈ రెండు పార్టీలకు దక్కిన సీట్లలో భారీ వ్యత్యాసం స్పష్టంగా కనబడుతోంది దాదాపు నాలుగు శాతం మేర ఉట్ల ను వైసీపీ కోల్పోయినట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు 4 శాతం మేర ఓట్లు వైసీపీ కోల్పోయింది. ఎలాగూ సొంత పార్టీ సర్వేలోనే 60 శాతం ఎమ్మెల్యేలు, వారితో పాటు 9 మంది మత్రులు పరాజయం పాలవుతారని తెలిపింది. అయితే జగన్మోహనరెడ్డి వీటిని అంతగా పట్టించుకోలేదు. వీటిపై దిద్దుబాటు చర్యలు చేపట్టారుట. తాజా సర్వే రిపోర్టులోనూ ఓటమి పాలయ్యే మంత్రుల సంఖ్య పెరగడం ఆశక్తి కల్గిస్తోంది. కాగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్ కెబినెట్ ల మంత్రులుగా కొనసాగుతున్న మేకతోటి సుచరిత, వెల్లంపల్లి శ్రీనివాస్ తానిటి వనతి, పాముల పుష్పశ్రీవాణి, అనిల్ కుమర్ యావద్, చెరుకువాడ శ్రీరంగనాధ రాజు, గుమ్మనూరు జయరాం, సిదిరి అప్పలరాజు, పినిపే విశ్వరూప్ పరాజయం పాలవుతారని ప్రచారం జరుగుతోంది.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!