YS Sharmila: తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై ఉమ్మడి పోరాటానికి ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలో ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల భావించారు. రాష్ట్రంలో కేసిఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ టీపీ లు వేరువేరుగా నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన నిరుద్యోగ సమస్యపై ఉమ్మడి గా కార్యాచరణ సిద్దం చేద్దామని, ప్రగతి భవన్ మార్చ్ కు పిలుపునిద్దామని షర్మిల .. అటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు ఫోన్ చేసి కోరారు. వాస్తవానికి రాజకీయాల్లో కాంగ్రెస్ – బీజేపీ ఉప్పు, నిప్పు. రాష్ట్రంలో కేసిఆర్ సర్కార్ ను దించేయాలని, అధికారంలోకి రావాలని రెండు పార్టీలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి.
బీజేపీతో కమ్యూనిస్టులు ఎలా కలవరో కాంగ్రెస్ పార్టీతో బీజేపీ కలవదు. షర్మిలమ్మ ఈ లాజిక్ మిస్ అయినట్లున్నారు. ఇద్దరు నాయకులకు ఫోన్ చేసి పోరాటానికి కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. షర్మిల సూచనలపై రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ ప్రతిపక్షాలు కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందనీ, అ విషయంపై పార్టీ నేతలతో చర్చించిన అనంతరం ఉమ్మడి పోరాటంపై నిర్ణయం తీసుకంటామని తెలిపారు. అయితే బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాత్రం వైఎస్ఆర్ టీపీతో కలిసి ఉద్యమం చేయడానికి సిద్దమే కానీ కాంగ్రెస్ పార్టీ పాల్గొంటే తాము మాత్రం పాల్గొనమని తేల్చి చెప్పేశారు. దీంతో షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి అధికార బీఆర్ఎస్ పై పోరాటం చేస్తుందా లేక బీజేపీ తో కలిసి పోరాటం చేస్తుందా అనే పెద్ద పజిల్ గా మారింది.
షర్మిలకు బండి సంజయ్ పెద్ద పరీక్ష పెట్టారు. కాంగ్రెస్ ను కాదని బీజేపీతో కలిసి పోరాటం చేస్తే అధికార బీఆర్ఎస్ వైఎస్ఆర్ టీపీని బీజేపీ బీ టీమ్ అని విమర్శిస్తుంది. కాంగ్రెస్ కూడా అలానే విమర్శిస్తుంది. ఒక వేళ బీజేపీని కాదని కాంగ్రెస్ తో కలిసి పోరాటం చేస్తే కాంగ్రెస్ కి వైఎస్ఆర్ టీపీ బీ టీమ్ వాళ్లు విమర్శిస్తారు. దీంతో షర్మిల కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటం చేస్తుందా, బీజేపీతో కలిసి పోరాటం చేస్తుందా అనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
Nikhat Zareen: హైదరాబాద్ లో నిఖత్ జరీన్ కు గ్రాండ్ వెల్కమ్