అక్టోబర్ 02 వ తేదీ ఆరో రోజున కనక దుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కావున అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి కదంబం, చక్కర పొంగలితో పాటు క్షీరాన్నం కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు.అమావారికి ఈరోజు పెట్టే కదంబం ప్రసాదం చాలా ప్రత్యేక మైంది అని చెప్పాలి మరి ఆ ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
కదంబం ప్రసాదం తయారీకి కావలిసిన పదార్ధాలు:
కందిపప్పు -1/2 కప్
బియ్యం -1/2 కప్ కొత్తబియ్యం
1 -వంకాయ
1/4 -సొరకాయ
1 -దోసకాయ
బీన్స్ -తగినన్ని
1 – బంగాళాదుంప
వేరుశెనక్కాయలు – హాఫ్ కప్
2 -మొక్కజొన్నలు
1/2 -క్యారెట్
2 -టోమాటోలు
కరివేపాకు- తగినంత
కోత్తమీర- కొద్దిగా
కోరిన పచ్చి కొబ్బెరి -1 కప్ప
4 -పచ్చి మిర్చి
నూనె -తగినంత
నెయ్యి చిన్న కప్పు
చింతపండు -గొజ్జు తగినంత
ఉప్పు – సరిపడా
పసుపు -తగినంత
2చెంచాలు -సాంబర్ పౌడర్
పోపు సామాగ్రి
ఇంగువ చిటికెడు
తయార్ చేయవలసిన విధానము:
ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కోని పక్కన పెట్టుకొండి.ఇప్పుడు కుక్కర్లో కందిపప్పు ,బియ్యం పీనట్, టొమోటో తప్పా మిగిలిన అన్ని కూరగాయలు వేసి
పసుపు , ఉప్పు ,నీళ్ళు వేసి రెండు విజిల్స్ వచ్చే దాక ఉంచి స్టవ్ అఫ్ చేయండి .ఇప్పుడు మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి అయ్యాక అందులో కొద్దిగ ఆవాలు వేసి అవి చిట్లిన తరువాత పచ్చిమిర్చి ,కరేపాకు ,టొమాటో ,పీనట్స్,చింతపండు గొజ్జు ,సాంబర్ పౌడర్ ,వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు వుడికిన రైస్లో ఇవన్నీ వేసి,కోత్తమీర ,కరేపాకు,నెయ్యి వేసి మరోసారి వుడికించండి. అంతా బాగా వుడికిన తరువాత ,ఎండుమిర్చి ,ఇంగువతో తాలింపు పెట్టి కొబ్బరి కలిపి దించేయండి..వేడి వేడిగా దుర్గాదేవికి నెయ్యివేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!