దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే రాధ ఆదిత్య కు ఫోన్ చేసి పెనిమిటి ఇంట్లో దేవి కనిపించడం లేదు.. తెలిసిన వాల్లందరినీ అడిగాం.. సరే నువ్వు బాధపడకు నేను వస్తున్నా అని ఆదిత్య, రుక్మిణి ఇద్దరు కలిసి దేవిని వేతుకుతారు..
మరోవైపు దేవి రాధ ఫోటో తీసుకుని పక్క ఊరిలో వాళ్ళ అమ్మ ఎవరికైనా తెలుసా అని అడుగుతుంది.. అలా వాళ్ళ నాన్న ఎవరో తెలుసుకోవచ్చు అని దేవి ప్రయత్నిస్తింది.. దేవి ఇంటికి వెళితే అందరూ గుడికి వెళ్లారు అని చెబుతారు..ఇక ఎవరైనా అడిగి తెలుసుకోవలని దేవి మళ్ళీ ఊరిలోకి వెళ్లి వెతుకుతుంది.. అలా వెతుకుతున్న రాధ, ఆదిత్య కు దేవి ఏదో ఫోటో చూపిస్తూ ఏదో మాటలాడటం గమనించి..
రాధ ఏడుస్తూ దేవమ్మా అని పిలుస్తుంది.. ఎంది దేవామ్మా నువ్వు.. నువ్వు కనిపించక ఇల్లంతా వెతికాను.. అందరం నీకోసం ఇలా వెతుకుతున్నాను.. ఏంది దేవమ్మ నువ్వు చేసిన పని అని రాధా అడుగుతుంది. ఆదిత్య కూడా దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఇలా చేశావు అని అడుగుతాడు. మా అమ్మని ఎన్ని సార్లు అడిగినా మా నాన్న ఎవరో అని అడిగితే ఏమీ సమాధానం చెప్పడం లేదు. అందుకే ఇలా చేశాను అని దేవి సమాధానం చెబుతుంది. ఇక ఎప్పుడైనా ఆదిత్య రుక్మిణి ఇద్దరు కలిసి నిజం చెబుతారా లేదా అనేది చూడాలి..