రాధ ఆ ఇంటికి వెళ్తున్నావ అని మాధవ్ అడుగుతాడు.. ఆ ఇంటికి కాదు నా ఇంటికి వెళుతున్నాను.. నేను నా బిడ్డ నా పెనిమిటి ఇంటికి వెళ్తున్నాము.. నాకు ఒక మాట చెప్పొచ్చు కదా రాదా అని మాధవ అడుగుతాడు.. నీకు ఎందుకు చెప్పాలి నేను నా బిడ్డ నా అత్తారింటికి వెళ్తున్నాము.. మధ్యలో నీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మేము సంతోషంగా మా ఇంటికి వెళ్తున్నావు అని రాదా అంటుంది.. నువ్వు మధ్యలో అడ్డురావద్దు అని రాధ మాధవ్ కి వార్నింగ్ ఇస్తుంది..
కమల బిడ్డను దేవుడమ్మ ఉయ్యాల ఫంక్షన్ లో వేస్తుండగా.. నేను ఉండగా నువ్వు ఎలా చేస్తావు అవ్వ అంటూ దేవి అడుగుతుంది. ఇక దేవి చేతులతో ఆ బిడ్డను ఉయ్యాలలో వేయిస్తుంది. ఈ అక్క ఉండగ అని దేవి అంటుంది.. అంతలో దేవుడమ్మ ఆ పాపకు రుక్మిణి అని నామకరణం చేస్తుంది.. ఆ పేరుని అందరూ ఆనందిస్తారు నాకు నచ్చిన పేరు మీ అందరికీ నచ్చే పేరు ఆ ఒక్కటే అని అనిపించింది అందుకే ఆ పేరు పెట్టాను పాపకి అని దేవుడమ్మ అంటుంది..
పైగా రుక్మిణి, కమల ఇద్దరు ఒకే రక్తం.. ఇప్పుడు ఆ రక్తంలో నుంచి వచ్చిన పాపకు రుక్మిణి అని నామకరణం చేశాను అని దేవుడమ్మ అంటుంది. నాకు తెలుసు ఆంటీ మీరు కచ్చితంగా మా అందరికీ ఇష్టమైన మా అక్క పేరే పెడతారు అని సత్యా అంటుంది. అక్క అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు అని సత్య అంటుంది. రుక్మిణి పేరు వినగానే ఆదిత్య రుక్మిణి ఫంక్షన్ కి వచ్చిందేమోనని మొత్తం వెతుకుతూ ఉంటాడు.. అప్పుడే రుక్మిణి టెడ్డీబేర్ బొమ్మల పక్కన నుంచుని ఉంటుంది.. రుక్మిణిని చూసిన ఆదిత్య షాక్ అవుతాడు..