దేవుడమ్మ రుక్మిణీ ఫోటో పట్టుకుని ఏడుస్తూ బాధపడుతుంది.. ఎక్కడ ఉన్నావు.. నాకు ఎప్పుడు కనిపిస్తావు.. నిన్ను మళ్ళీ నా కళ్ళతో ఎప్పుడు చూస్తానో నాకు అర్ధం కావట్లేదు.. ఒక్కసారి కనిపించు అని దేవుడమ్మ ఏడవడం గమనించిన.. తన భర్త ఈశ్వర్ ప్రసాద్ ఏంటి దేవుడమ్మ ఇలా బాధపడడం అని అంటాడు.. 10 సంవత్సారాలు అయ్యింది రుక్మిణి ఈ ఇంటి గడప దాటి.. ఇప్పటికీ రుక్మిణి బ్రతికే ఉందని మనకు తెలిసింది.. అలాగే తను కూడా మన ఇంటికి త్వరలోనే వస్తుంది అని చెబుతాడు..
మనకి పెళ్లయిన నుంచి ఇప్పటివరకు నేను మిమ్మల్ని ఏ కోరిక కోరలేదు అని దేవుడమ్మ వాళ్ళ ఆయనతో అంటుంది.. ఇప్పుడు తన రెండు చేతులు దోసిడ పెట్టి అర్ధిస్తున్నట్టుగా పెట్టీ.. కోడల్ని నా ఇంటికి తీసుకురమ్మని వాళ్ళ ఆయనను అర్ధిస్తుంది.. నా కోరిక తీర్చమని అడుగుతుంది.. నువ్వు అడిగినందుకైనా నేను వెతికిస్తాను దేవుడమ్మ.. నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకు అని అంటాడు..
భాగ్యమ్మ రాద ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా దేవి వస్తుంది.. ఏమ్మా దేవి నిద్ర పట్టలేదా అని భాగ్యమ్మ అడుగుతుంది.. లేదు అనగానే.. సరే పదా నేను నీకు కథలు చెబుతూ నిద్ర పుచ్చుతాను అని అంటుంది.. నాకు ఈరోజు మా అమ్మ మా నాన్న కథ చెప్పాల్సిందే అని.. అమ్మ నీకు నాన్నకు పెళ్లి ఎప్పుడు అయింది.. నువ్వు ఈ ఇంటికి రాకముందు ఎక్కడ ఉండే దానివి.. నాకు ఈ పొద్దు నువ్వు నాయనా ఏ ఊరులో ఉన్నారో చెప్పాలే అని అంటుంది.. అమ్మా నువ్వు చెప్పు అని దేవి పట్టుబడుతుంది.. అప్పుడు ఎప్పుడు పరేషాన్ అవుతుంది.. నాయనా గురించి చెప్పమంటే చెప్పదు అని అంటుంది దేవి..