Devatha: రుక్మిణి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని రామ్మూర్తికి చెబుతుంది. ఇంకా నువ్వు ఇంట్లో ఉన్నావు అంటే అది నీ మంచితనం అమ్మ.. ఆఫీసర్ సార్ నీ భర్తని తెలుసా కూడా నువ్వు వెళ్లకుండా మా గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు నిజంగా దేవతవి అని రామ్మూర్తి అంటాడు. అమ్మ నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. స్కూల్ నుంచి దేవిని తీసుకొని రమ్మని భాగ్యమ్మతో చెబుతుంది.
దేవుడమ్మ కోపంగా ఉంటుంది. రుక్మిణి బ్రతికే ఉన్నా ఎందుకు ఆదిత్య తనతో అబద్ధం చెప్పాడు అని అనుకుంటుంది. ఆదిత్య ఇంట్లోకి రావడంతోనే దేవుడమ్మ ఆదిత్య చంప పగలగొడుతుంది. ఆ సౌండ్ ని ఇంట్లో వాళ్ళందరూ బయటకు వస్తారు .ఏమైంది దేవుడమ్మ అని వాళ్ళ ఆయన అడుగుతారు. మీరు ఎవరు మాట్లాడకండి ఈ విషయాన్ని నేను ఆదిత్య తోనే తేల్చుకోవాలి. రుక్మిణి బ్రతికే ఉందా.. నువ్వు నిన్న గుడిలో దీపాలు వెలిగించింది తనతోనా అని దేవుడమ్మ అడుగుతుంది.అవును నేను నిన్న రుక్మిణి తోనే దీపాలు వెలిగించాను అని ఆదిత్య దేవుడమ్మకి నిజం చెబుతాడు. తను బ్రతికే ఉంది తనని కలుస్తున్నాను అని ఆదిత్య దేవుడు అమ్మకి నిజం చెబుతాడు.
మరోవైపు సత్య రుక్మిణి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. భాగ్యమును చూసి అక్క ఇంకా ఎందుకు నా భర్త వెంటపడుతుంది తనకి మాధవ్ ఉన్నాడు కదా అయినా మళ్ళీ ఆదిత్య తో ఎందుకు మాట్లాడుతుంది. తనతో ఎందుకు కలిసి తిరుగుతుంది అని సత్య అడుగుతుంది. నీకు ఎవరు చెప్పారు తను ఎప్పటికీ ఆదిత్య భార్య అని భాగ్యమా చెబుతుంది. భాగ్యమ్మ సత్య చంప పగలగొడుతుంది. తను మాట్లాడిన మాటలకు నీకు సత్య రుక్కవ్వ గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావో తను నీకోసం ఆ ఇంటిని వదిలేసుకొని వచ్చింది.
ఆదిత్య రుక్మిణి ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు గర్భవతి కదా మీ ఇద్దరికీ పుట్టిన బిడ్డ ఎక్కడ ఉంది అని అడుగుతుంది. అప్పుడే దేవి వచ్చింది కనీసం తనలా అన్న ఉంటుందా అని దేవుడమ్మ అడుగుతుంది. దేవినే నా కూతురు నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని ఆదిత్య చెబుతాడు. అవును దేవుడమ్మ అవ్వ నాకు కూడా ఈ నిజం తెలుసు అని దేవి చెబుతుంది. ఆదిత్యను నాన్న అని పిలుస్తుంది. దేవి నాయనా అని పిలవగానే ఆదిత్య ఆనందభాష్పాలతో ఇంకొకసారి పిలవమని అడుగుతాడు. నాయనా అని దేవి మళ్ళీ పిలుస్తుంది. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ ఫుల్ ట్విస్టులతో కొనసాగింది..