దేవి వాళ్ళ నాయన దగ్గర ఉండటం నాకు సంతోషంగా ఉంది అని రాధ ఒంటరిగా కూర్చుని అనుకుంటుంది.. దేవి వాళ్ళ అవ్వ, తాత, బాబాయ్, పిన్ని అందరితో కలిసి ఉండటం నిజంగా నాకు ఆనందంగా ఉంది.. ఈ ఆనందాన్ని దేవికి శాశ్వతంగా అందించాలి.. ఆదిత్య వాళ్ళ నాన్న అని రేపు బోనం ఎత్తిన ఆ సంబరాల్లో దేవికి నిజం చెప్పేస్తాను.. ఇక మాధవ్ సార్ కూడా దాన్ని ఆపలేరు అని అనుకుంటుంది రాధ..
నందు మాటలకు షాక్ అయినా వసుధర.. లాస్య ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా.!?
మరోవైపు మాధవ్ మాత్రం దేవి ఈ ఇంటిలో నుంచి ఎప్పటికీ వెళ్ళకూడదు.. ఒకవేళ దేవి ఇంటిలో నుంచి వెళ్ళిపోతే నా రాధ కూడా ఈ ఇంటి గడప దాటేస్తుంది.. నా రాధ ఆ పని ఎప్పటికీ చేయకూడదు అంటే దేవికి ఎప్పటికీ నేనే నాన్న లాగా ఉండాలి.. రాధ ఎప్పటికీ నాతోపాటు ఈ ఇంటి లోనే ఉండాలి.. అందుకు నేను ఎంత ఎవరికైనా ఏం చేయడానికైనా తెగిస్తాను అని మాధవ్ అనుకుంటాడు.. ఇందుకోసం ఏదో ఒకటి చేయాలి అని తన ప్లాన్స్ లో తను ఉంటాడు మాధవ్..
సత్య ఆ ఇంటిలో మా అక్క సంతోషంగా ఉంటుందా లేదా అని దేవిని అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటుంది.. అమ్మ దేవి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది.. ఏం లేదు పిన్ని చెస్ ఆడుతున్నాను అని దేవి చెబుతుంది.. ఇంట్లో మా అక్క ఎలా ఉంటుంది అని అడుగుతుంది.. చాలా సంతోషంగా ఉంటుంది చిన్నమ్మా.. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది.. అది కూడా మా గురించి అని అంటుంది దేవి.. అమ్మకు నేనంటే చాలా ఇష్టం.. అందుకే ఆఫీసర్ సారు నేను ఇద్దరూ కలిసి గీయించుకున్న బొమ్మను అద్దం కట్టించి నాకు గిఫ్ట్ గా ఇచ్చింది అని చెబుతుంది దేవి.. ఆ మాట వినగానే సత్య షాక్ అవుతుంది.. ఆదిత్య దేవి ఇద్దరు కలిసి గియించుకున్న బొమ్మలు అక్క ఎందుకు గ్లాస్ వేయించి ఫోటో ఫ్రేమ్ చేయించింది.. అంటే అక్క కూడా ఆదిత్య మీద ఇంకా ప్రేమ ఉన్నట్లు ఉంది.. ఆదిత్య ఈ విషయాన్ని నాకు ఎందుకు చెప్పలేదు అని అనుకుంటుంది.. ఆ తరువాత ఆదిత్య దగ్గరకు వెళ్లి నువ్వు దేవితో గీయించుకున్న బొమ్మ గురించి నాకు ఎందుకు చెప్పలేదు అని అంటుంది సత్య.. అదేం పెద్ద విషయం కాదుగా సత్య అందుకే నీకు చెప్పలేదు.. మనం అమెరికా వెళ్లడానికి కావలసిన ఏర్పాట్లు చేసావా అని అడుగుతాడు ఆదిత్య.. చేశాను అని చెబుతుంది సత్య.. రేపటి ఎపిసోడ్ లో దేవుడమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అందరితో కలిసి దేవి కూడా బోనం ఎత్తుతుంది..