మాధవ్ రాధ దగ్గరకు వచ్చి వాటర్ కావాలని అడుగుతాడు.. ఇదిగో సారు నేను మీరు ఎన్ని ప్లాన్స్ చేసినా దేవమ్మ నీ వాళ్ళ నాన్న దగ్గరకు చేరుస్తను అందులో ఎలాంటి మార్పు ఉండదు.. నువ్వు నాకు ఇలా వార్నింగ్ ఇస్తే నాకు ఇంకా కోపం ఎక్కువ అవుతుంది అని రిషి అంటాడు.. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను ఆదిత్య కు దేవిని దగ్గర చేరుస్తాను.. నువ్వు నా మధ్యలో రావచ్చు కానీ.. ఆదిత్య నే నా పెనిమిటి అని రాధ అంటుంది.. నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేయడం మనుకోమని ఆదిత్య కు వార్నింగ్ ఇస్తుంది రాధ..
జానకమ్మ దేవి, చిన్మయి కి అన్నం తినిపిస్తుంది.. అప్పుడే మాధవ్ వచ్చి నాకు అన్నం కలిపి నీ చేత్తో గోరు ముద్దలు పెట్టమని మాధవ్ వాళ్ళ అమ్మ ను అడుగుతాడు.. అదేంటి రా చిన్న పిల్లాడిలా అని వాళ్ళ అమ్మ అంటుంది.. నీ చేతి గోరు ముద్ద నాకు సెంటిమెంట్ అమ్మా.. నువ్వు తినిపించిన గోరు ముద్ద తిని నేను 10th, ఇంటర్, డిగ్రీ పరీక్షలు పాస్ అయ్యాను.. ఇప్పుడు జీవితంలో రాయబోయే పరీక్షకు నాకు నీ ఆశీర్వాదం కావాలి అమ్మ.. అందుకే నన్ను ఆశీర్వదిస్తూ.. నీ చేత్తో గోరు ముద్ద పెట్టు అని అంటాడు మాధవ్..
ఇంతకు ఏం పరీక్ష అని జానకమ్మ మాధవ్ ను అడుగుతుంది.. నేను గెలిచిన తరువాత నికే అర్థం అవుతుంది కదా అమ్మా అని రాధ ను చూస్తూ అంటాడు మాధవ్.. రాధ లోలోపల ఈ మాధవ్ సార్ మళ్ళీ ఏం కుట్ర చేస్తాడో అని ఆలోచిస్తుంది.. రాధ టెన్సన్ పడటం చూసి మాధవ్ సంతోషిస్తాడు..
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!