జానకమ్మ మాధవ్ కోరిక మేరకు తనకు ఒక ముద్ద కలిపి తినిపిస్తుంది.. అప్పుడే ఫోన్ రావడంతో రాధ జానకమ్మ వైపు చూస్తుంది.. దేవుడమ్మ గారు మీరు ఫోన్ చేశారు ఏదైనా పని ఉందా అని అడుగుతుంది జానకమ్మ.. దేవుడమ్మ పేరు వినగానే రాధా అక్కడే నిల్చుని ఏం మాట్లాడుకుంటున్నారు అని వింటుంది.. మా కమల కి పాప పుట్టింది రేపు బారశాల ఫంక్షన్ చేస్తున్నాము.. మీరు మీ ఇంట్లో వాళ్ళు కచ్చితంగా రావాలి అని చెబుతుంది.. ఒకసారి దేవికి ఫోన్ ఇవ్వమని చెబుతుంది.. దేవుడమ్మ హే చిట్టి రాక్షసి ఇంట్లో వాళ్ళందరినీ రమ్మని చెప్పాను.. మళ్లీ నీకు స్పెషల్ గా చెప్పలేదు అంటవుగా అని నీకు కూడా చెబుతున్నాను.. తప్పకుండా ఫంక్షన్ కి రా అలాగే మీ అమ్మను కూడా తీసుకొని రా అని చెబుతుంది.. తప్పకుండా తీసుకొస్తాను దేవుడమ్మ అవ్వ అని మాట ఇస్తుంది.. దేవి నువ్వు మాట ఇచ్చావు అంటే కచ్చితంగా నువ్వు మీ అమ్మని తీసుకువస్తావని నాకు తెలుసు.. కచ్చితంగా రేపు ఇంట్లో వాళ్ళందరూ కలిసి కమల పిన్ని వాళ్ళ పాప ఫంక్షన్ కి రమ్మని చెబుతుంది..
రుక్మిణి ఆదిత్య కి ఫోన్ చేసి పెనిమిటి రేపు కమలక్క పాపకు బారసాల ఫంక్షన్ చేస్తున్నారు.. నాకు అక్కడికి రావాలని ఉంది అని చెబుతుంది.. నువ్వు ఇప్పుడు ఎలా వస్తావు అని ఆదిత్య అడుగుతాడు.. ఏమో ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాక జరిగే మొదటి ఫంక్షన్ ఇది.. నాకు రావాలని ఉంది.. పైగా అమ్మ కూడా మా ముగ్గురిని కలిసి ఒకే చోట ఉండాలని కోరుకుంది. నాకు కూడా ఆ ఫంక్షన్ కి రావాలని ఉంది ఏం చేయాలో చెప్పు అని ఆదిత్యాను అడుగుతుంది రుక్మిణి..
దేవి చిన్మయి అందరూ కమల వాళ్ళ పాప ఫంక్షన్ కి వెళ్దామని రెడీ అవుతారు ఫంక్షన్ కి రమ్మని పిలుస్తుంది.. నేను వస్తాను మీరందరూ ముందు వెళ్ళండి అని చెబుతుంది.. నువ్వు ఎప్పుడు అంటే రావు నేను దేవుడమ్మ అవ్వకు మాటే ఇచ్చాను.. నాతో పాటు రమ్మని దేవి పిలుస్తుంది.. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత వస్తాను అని అంటుంది. మీ అమ్మా ఎప్పుడు వచ్చింది కనుక ఈరోజు రావడానికి తను అంతే.. పదండి పదండి టైం అవుతుంది మనం వెళ్దామని జానకమ్మ అంటుంది.. రుక్మిణి ఎలాగ ఫంక్షన్ కు వెళ్తుంది అనేది తరువాయి భాగంలో చూద్దాం..