మాధవ్ ఎన్నడు లేని విధంగా ఈరోజు ఇంట్లో పూజ చేస్తాడు.. ఆ సీన్ చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు.. నిజంగా మాధవైనా.. తనలో ఈ మార్పుకు కారణం ఏంటి అని అందరూ అనుకుంటారు.. అమ్మ హారతి తీసుకో అంటూ హారతి పళ్లెం తీసుకుని వస్తాడు ఇక పిల్లల్ని రాదను కూడా హారతి తీసుకోమని చెబుతాడు.. మాధవ్ ఇలా చేశాడు అంటే కచ్చితంగా ఏదో ప్లాన్ వేసి ఉంటాడు అని రాధా మనసులో అనుకుంది.. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే.. రాధ తో మాధవ్ ఈరోజు నాది నిన్న నీ నవ్వుతో రోజు ముగిస్తే.. ఈరోజు నా ఆనందంతో ఈరోజు ముగుస్తుంది అని అంటాడు..
రుక్మిణి ఆదిత్య కు ఫోన్ చేస్తుంది అప్పుడే సత్య ఆదిత్య టిఫిన్ పెడుతూ ఉండగా ఇంపార్టెంట్ కాల్ అని చెప్పి పక్కకు వెళ్లి మాట్లాడుతాడు.. రుక్మిణి ఏం జరిగింది అని అడుగుతారు.. మాధవ సార్ మళ్లీ ఏదో కొత్త ప్లాన్ వేసినట్టు ఉన్నాడు.. ఈ రోజు పూజ పరీక్ష అంటూ ఏవేవో కొత్త కొత్తగా మాట్లాడుతున్నాడు మాధవ్ సార్ గురించి.. నేను భయపడుతున్నానని చెప్పడానికి ఫోన్ చేయలేదు మాధవ్ సార్ ని ఎలాగైనా ఎదిరించి దేవిని నీ తనకు చేరుస్తాను..ఈ విషయం చెబుదామని ఫోన్ చేశాను అని అంటుంది రుక్మిణి..
జానకమ్మ రాధ దగ్గరకు వెళ్లి మొన్న దేవుడమ్మ వాళ్ల ఇంటికి ఫంక్షన్ కి వెళ్ళాలి కదా.. అక్కడ దేవుడమ్మ నిన్ను చాలాసార్లు అడిగింది. ఆమె స్థాయికి నిన్ను అడగాల్సిన అవసరం లేదు. కానీ గుర్తుంచుకొని మరీ నిన్ను అడిగింది .. ఇలా పద్దాక బయటకు రాను అని అంటే ఎలాగమ్మా.. మీ వాళ్ళు ఎవరైనా చూస్తారని భయంగా ఉందా.. లేదంటే నీ భర్త నిన్ను ఇబ్బంది పడతాడని బాధపడుతున్నావా.. అసలు నీ మనసులో ఉన్న మాట ఏంటో నాకు చెప్పమని జానకమ్మ రాధ ను అడుగుతుంది..