దేవి మనసులో ఖరాబ్ చేసిన మాధవ దగ్గరికి కోపంగా వెళుతుంది రాధ.. ఏంటి రాధ దేవి ద్వారా నీకు నిజం తెలిసిందా అని మాధవ్ అడుగుతాడు.. నువ్వు అసలు మనిషివేనా.!? రామ్మూర్తి జనకమ్మలకు నువ్వు నిజంగానే పుట్టావా అని రాధ అంటుంది.. ఏంటి రాధ హద్దు మీరు మాట్లాడుతున్నావు అని అంటాడు మాధవ్.. నిజంగానే నువ్వు వాళ్లకు పుట్టావా..! లేదంటే ఏదైనా చెత్త కుప్పలో నుంచి నిన్ను ఎత్తుకు వచ్చారా.!? నువ్వు అసలు మనిషివేనా కడుపుకి అన్నం తింటున్నావా..! గడ్డి తింటున్నావా.!? ఇలా బిడ్డ మనసుని ఆగం చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది అంటూ.. తన చెంప చెల్లుమనిపించాలని చేయి ఎత్తుంది.. కానీ తన మనసును తామాయించుకొని వెనక్కి తగ్గుతుంది.. నువ్వు నన్ను ఎంతయితే బాధ పెడుతున్నావో.. అంతకు పది రెట్లు ఎక్కువ నేను నిన్ను బాధ పెడతాను గుర్తుంచుకో అని మాధవకు వార్నింగ్ ఇస్తుంది..!!
రుక్మిణి ఏడుచుకుంటూ ఆదిత్య దగ్గరకు వెళుతుంది. ఏమైంది రుక్మిణి అలా ఉన్నావు.. దేవి తీసుకువచ్చవా.. ఇదిగో దేవికి మన ఇద్దరి పెళ్లి ఫోటో చూపించి.. నేనే మీ నాన్నను అని చెబుతాను దేవికి.. నా బిడ్డకే నేను నాన్నను అని చెప్పుకోవడానికి సాక్ష్యం చూపించాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆదిత్య అంటాడు.. ఆదిత్యను పట్టుకొని రుక్మిణి ఏడిచేస్తుంది ఏమైంది అని ఆదిత్య అడుగుతాడు.. రుక్మిణి మాధవ్ మరోసారి బిడ్డ మనసుని ఆగం చేశాడని.. జరిగిన విషయాన్ని వివరంగా చెబుతుంది.. సరే నువ్వు ఇంటికి వెళ్లి ఆ మాధవ్ ఇంకోసారి బిడ్డ మనసును ఆగం చేయకుండా చూసుకో.. నేను మిగతా విషయాన్ని చూసుకుంటాను అని ఆదిత్య అంటాడు..
ఆదిత్య రాధ చెప్పిన వాళ్ల గురించి వెతుకుతాడు.. కానీ వాళ్ళు కనిపించకపోతే సరికి ఇది ఇంటికి వస్తాడు.. అప్పుడే వాళ్ళ అమ్మ దేవుడమ్మ వచ్చి పిల్లల గురించి పట్టించుకోమని.. సత్య ను అమెరికా తీసుకెళ్లామని చెబుతుంది.. వచ్చేవారంలో నీకు మూడు రోజులు సెలవులు ఉన్నాయంట కదా ఇంకో మూడు రోజులు సెలవు పెడితే సరిపోతుంది అని అంటుంది.. ఎప్పుడు చూసినా ఈ పిల్లలు గోలేనా.. నన్ను ఎప్పుడు ప్రశాంతంగా ఉండనివ్వరా.. అని ఆదిత్య దేవుడు అమ్మ మీద విసుకుని వెళ్లిపోతాడు..