Devatha: భాగ్యమ్మ రుక్మిణి పిలిచి ఏంది బిడ్డ ఎన్నాళ్ళని ఇలా ఆలోచిస్తూ ఇక్కడే ఉండిపోతావు.. దేవికి నిజం చెప్పేయొచ్చుగా అని అంటుంది.. ఒకవేళ దేవికి నువ్వు నిజం చెప్పకపోతే చెప్పు.. నేనే వెళ్లి పటేల్ సార్ వాళ్ళ నాయన అని చెప్పేస్తాను అని అంటుంది.. నిజం చెప్పడానికి నిమిషం పట్టదు అమ్మ.. కానీ చెప్పిన తర్వాత దేవి అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు.. అందుకే ఆలోచించే ఆగిపోతున్నాను అని అంటుంది.. ఒకవేళ ఇప్పుడు దేవికి నేను నిజం చెప్పినా కూడా సత్య పరిస్థితి ఏమవుతుంది.. నేను ఆ ఇంటికి వచ్చి దాన్ని చంపేసుకోమంటావా అని రుక్మిణి అంటుంది..
మాధవ్ ఇంట్లో ఎవరికోసమో వెతుకుతున్నట్టుగా కనిపిస్తాడు.. ఎవరి కోసం రా వెతుకుతున్నావు.. రాధ కోసమా అని వాళ్ళమ్మ అడుగుతుంది.. అవునమ్మా రాధ ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు.. పిల్లలకి పొద్దున క్యారేజ్ పెట్టలేదు కదా.. పిల్లలకి క్యారేజీ ఇవ్వడానికి వెళ్ళింది అని జానకమ్మ అంది.. నాకు చెబితే నేను ఇచ్చి వచ్చేవాడిని కదా అని మాధవ్ అంటాడు.. నువ్వు బయట ఏదో పనిలో ఉన్నావా అనుకొని రాధ చెప్పలేదు ఏమోలే అని జానకమ్మ అంది.. మనసులో దేవికి నన్ను దూరం చేయాలని నా చేత క్యారేజ్ పంపించలేదు అని మాధవ్ అనుకున్నాడు..
ఈమధ్య నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఎందుకు ఇలా మారిపోతున్నావు అని మాధవ్ ని జానకమ్మ అడుగుతుంది. నువ్వు చూస్తే ఇలా ఉంటే రాధ కూడా ఇలానే ఉంటుంది.. ఒకవేళ నువ్వు రాధని ఏమైనా అన్నావని జానకమ్మ అడుగుతుంది.. నువ్వు రాధ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అమ్మా.. తన గురించి ఆలోచించడం మానేసి మా గురించి మాత్రమే ఆలోచించు అని మాధవ్ వాళ్ళ అమ్మకి వార్నింగ్ ఇస్తాడు..