Guppedantha Manasu October 31 Today Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు అక్టోబర్ 29 వ తేదీ Guppedantha Manasu సీరియల్ 594 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం. కొడుకు గురించి బాధపడుతున్న మహేంద్ర దగ్గరికి భోజనం తీసుకొని వచ్చి తినిపించాలని చూస్తుంది జగతి. నాకు ఆకలి లేదు అని మహేంద్ర అంటాడు.నువ్వు తినకపోతే రిషి కూడా తినడు అని అన్నం తినిపిస్తుంది.
జగతిలో రిషిని చూసుకున్న మహేంద్ర :
ఇక మహేంద్ర మాత్రం జగతిలో రిషిని చూసుకుంటాడు నేనేమైనా తప్పు చేశానా జగతి అని అంటాడు మహేంద్ర.తొందరపడ్డామేమో అంటుంది జగతి. మనం దూరంగా వచ్చి ఉన్నాం కానీ తను కనిపిస్తే మనసుని అదుపులో ఉంచుకోలేము కదా అని అంటుంది జగతి. అదే కదా ప్రేమ అంటే అని తను కూడా జగతికి భోజనం తినిపిస్తాడు. మనం కూడా రిషి జీవితంలో వచ్చే వసంతం కోసం ఎదురుచూద్దాం.. తన జీవితంలో వచ్చే వెలుగుల కోసం ఎదురు చూడాలి అని అంటాడు మహేంద్ర. అదే ఎప్పటి వరకు అని అంటుంది జగతి.వసంతం వచ్చేవరకు అని అంటాడు మహేంద్ర. జగతి నాకు నమ్మకం ఉంది తప్పకుండా జరుగుతుంది అని అనుకుంటాడు మహేంద్ర.
గురుదక్షణ గురించి వసు మర్చిపోతుందా..?
సీన్ కట్ చేస్తే వసుధార రిషిని తీసుకొని అమ్మవారి గుడికి వస్తుంది. ఎక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావ్ అని రిషి అడగగా మనసులోని మాటలు మనసైన వాడితో చెప్పుకోవటానికి ఇంతకంటే మంచి ప్లేస్ ఇంకెక్కడ ఉంటుంది అని అంటుంది వసు. ఇక వసు చాలా ఎమోషనల్ గా రిషి చేతులు పట్టుకొని క్షమించమని అడుగుతుంది.ఏం చేస్తున్నావ్ వసుధార అని కంగారుగా అడుగుతాడు రిషి. నేను జగతి మేడంని అమ్మ అని పిలవమని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అని అంటుంది. నా మొండితనంతో నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నా పంతం మన బంధాన్ని ఎక్కడ దూరం చేస్తుందని చాలా భయపడ్డాను. కానీ మీరు చాలా సహనం చూపించారు. కానీ మీ సహనం ముందు నా పంతం చిన్న పోయింది సార్ అని బాధగా చెప్తుంది.ఇంతకీ
ఏం చెప్పాలనుకుంటున్నావ్ అని అడుగుతాడు రిషి. మీ వ్యక్తిత్వం గురించి అని అంటుంది వసు.
నన్ను క్షమించండి సార్ అంటూ రిషిని అడిగిన వసు :
నేను ఇంత మొండిగా ఉన్న నామీద మీ ప్రేమ అనువంత కూడా తగ్గలేదు, మీరు చాలా గ్రేట్ సార్ అని అంటుంది. వసు మాటలు రోషికి అర్ధం అయ్యి కానట్టు ఉంటాయి. సార్ మీ చేయి పట్టుకుని జీవితాంతం మీతో నడవవలసిన దాన్ని మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించండి అని బాధపడుతుంది.దానికి క్షమాపణలు ఎందుకు అని అడుగుతాడు రిషి. ఒక్కొక్కసారి క్షమాపణలు చెప్తేనే మనసు తేలిక పడుతుంది అని అంటుంది వసుధార. మిమ్మల్ని మచ్చలేని చంద్రుడిలాగా చూద్దామని అనుకున్నాను కానీ చంద్రుడిని మార్చాలనుకోవటం చాలా తప్పు అని అర్థమైంది అని అంటుంది వసు.
నా మొండితనంతోనే సార్ మీకు దూరమయ్యారని చాలా గిల్టీగా ఉంది అంటుంది వసు.డాడ్ వెళ్లిపోవడానికి నీకు ఏంటి సంబంధం అని అడుగుతాడు రిషి. లేని తల్లి ప్రేమ కోసం ఉన్న తండ్రి ప్రేమను కూడా దూరం చేశానేమో అని బాధపడుతుంది. వసులో వచ్చిన మార్పుకి చాలా ఆనంద పడిపోతాడు రిషి.
వసు, రిషిల మధ్య ఉన్న అడ్డుతెర తొలగిపోయిందా.?
మన మధ్య ఉన్న అడ్డుతెర తొలగినట్లేనా అని అడుగుతాడు. అవును సార్ నేను మిమల్ని మారమని ఇకపై నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను కానీ మారితే సంతోషిస్తాను అని అంటుంది. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ఇద్దరం పక్కపక్కనే ఉన్న ఏదో తెలియని అడ్డుతెర ఉండేది ఇప్పుడు ఆ అడ్డుతెర లేదు అని ఆనందంతో కన్నీరు పెట్టుకుంటాడు రిషి.ఇక వసు అమ్మవారికి దండం పెట్టుకుంటూ నన్ను ధైర్యంగా ముందుకు నడిపించు. మహేంద్ర సర్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకునే లాగా దీవించు అలాగని రిషి సార్ ని కూడా ఇబ్బంది పెట్టను అని దండం పెట్టుకుంటుంది వసు.ఆ తల్లి కొడుకుల్ని నువ్వే కలపాలి అని అమ్మవారికి దండం పెట్టుకుంటుంది. ఇద్దరు కూడా ఆనందంతో ఒకరికొకరు పువ్వులతో అభిషేకం చేసుకుంటారు..
జగతి గురించి ఇంటికి ఫోన్ చేయొద్దు అన్న దేవయాని :
మళ్ళీ సీన్ కాలేజ్ లో ఓపెన్ అవుతుంది మిషన్ ఎడ్యుకేషన్ కోసం మాట్లాడుకుంటారు కాలేజీలో స్టాఫ్.జగతి మేడం రాలేదనే కదా మీటింగు ఆపేశారు ఆవిడ రాకపోతే ఈ వర్క్ ఆగిపోతుంది అలాగని ఆవిడ కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అని వాళ్ళ ఇంటి ల్యాండ్ లైన్ కి ఫోన్ చేస్తారు వాళ్ళు. ఫోన్ లిఫ్ట్ చేసిన ధరణి దగ్గర ఫోన్ లాక్కొని, జగతి ఎక్కడికి వెళ్లిందో ఎప్పుడు వస్తుందో తెలియదు తనకోసం మళ్లీ ఎప్పుడు ఇక్కడికి ఫోన్ చేయకండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది దేవయాని.అదేంటి అత్తయ్య అలా చెప్పారు అని అంటుంది ధరణి. మరి ఏమని చెప్పమంటావ్ ధరణి ఎక్కడ ఉందో నీకు తెలుసా అని అడుగుతుంది దేవయాని. తెలియదు అని చెప్తుంది ధరణి. మరి నేను కూడా అదే చెప్పాను కదా జరిగిందా అని జరిగినట్టే చెప్పాను అని అంటుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్ ఈ మాటలు వింటాడు. దేవయాని పెద్దమ్మ చాలా నిక్కచ్చిగా మాట్లాడుతున్నారు అని అనడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.