అనసూయమ్మ తులసి చేత బోనం ఎత్తించాలని అనుకుంటుంది.. కానీ లాస్య ఏంటి అసలైన కోడల్ని నేనే.. బోనం ఎత్తే హక్కు నాకే ఉంటుంది అని భాగ్యతో కలిసి లాస్య గొడవకు వస్తుంది.. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అని అనసూయమ్మ అంటుంది.. అమ్మా మైసమ్మ తల్లి నీ దగ్గరకి వస్తె ఈ భక్తురాలిని అంటుంటే చూడమ్మా అంటుంది..
వసుధర సాక్షి ఇద్దరూ అమ్మవారికి బోనం సమర్పించి తులసి దగ్గరకు వస్తారు. ఏంటి ఉప్పు నిప్పు కలిసి వచ్చారు అని అంటుంది తులసి మేమిద్దరం ఉప్పు నిప్పు కాదు అంటే మా ఇద్దరి సమస్య ఒక్కటే అని వసుధారా అంటుంది మా తులసక్క వాళ్ళది కూడా అదే సమస్య అని అంటుంది భాగ్య కాకపోతే మీకు పెళ్లి అయింది మీకు పెళ్లి కాలేదు అని ఉంటుంది.. భాగ్య ఎక్కడ ఎవరు పోటీ పడటం లేదు.. ఎవరి కోసం ఆరాటపడడం లేదు అని తులసి గట్టిగా చెబుతుంది.. తులసి ఇప్పుడు ఏం చేసిందని నువ్వు అలా మాట్లాడుతున్నావ్ అని అంటుంది..
ఇక ఈ గొడవ చూసి వసుధరా, సాక్షి ఇద్దరూ షాక్ అవుతారు.. వసుధరా మనసులో ఇక్కడ ఎంత గొడవ అవుతున్నా ఈయన ఏం మాట్లాడాడంటే అని నందు వైపు చూస్తుంది.. ఇక నందు లాస్యను సపోర్ట్ చేస్తూ లాస్యనే ఈ ఇంటి కోడలు.. కాబట్టి తనకే బోనం ఎత్తే హక్కు ఉంటుంది.. తనే బోనం ఎత్తాలి అని నందు అంటాడు.. అమ్మానాన్నలకు దూరంగా ఉన్న వాళ్ళందరికీ ప్రేమ లేక కాదు.. ఈ ఇంటి నుంచి నేను ఎందుకు.. దూరంగా వెళ్ళవలసి వచ్చిందో అది మీకు కూడా తెలుసు అని నందు రియాక్ట్ అవుతారు.. మొత్తానికి అనసూయమ్మ తులసి చేతే బోనం ఎత్తిస్తానని మొక్కుకుంది అని అంటుంది.. దాంతో వసుధార కూడా తులసినే బోనం ఎత్తాలి అని అంటుంది.. కాదు నేను కూడా బోనం ఎత్తుతా అని లాస్య అంటుంది.. తులసి బోనం సమర్పించకుండా ఉండాలి అంటే ఈ స్లీపింగ్ టాబ్లెట్స్ ను తులసికి ఎలాగైనా ఇవ్వాలి అని భాగ్యతో ప్లాన్ వేస్తుంది.. మొత్తానికి లాస్య ఎన్ని కుట్రలు పండిన తులసి బోనం సమర్పిస్తుంది అది ఎలాగో తరువాయి భాగంలో చూద్దాం..