Intinti Gruhalakshmi: తులసి సంగీతం ట్యూషన్ కి ఒక్కరోజులోనే చాలా మంది పిల్లలు జాయిన్ అవుతారు.. తులసి సంగీత నేర్పిస్తుండగా ఒక పిల్లవాడు లెగిచి టీచర్ ఎండగా ఉంది అని అంటాడు.. తులసి ఈ రోజుకి సంగీతం క్లాస్ అయిపొయింది.. రేపటిలోగా నీడ గా ఉండేలా చేస్తాను అని చెప్పి పిల్లలు ఇంటికి పంపి చేస్తుంది.. ఇక తులసి షెడ్ ఏర్పాటు చేయడానికి కొలతలు వేసుకుంటూ ఉంటుంది.. వాళ్ళ మావయ్య సహాయం తీసుకుంటుంది.. ఈరోజు ఉన్న పిల్లలు రేపటికి ఇంకా పెరగవచ్చు. కాబట్టి పెద్ద షెడ్డు వేద్దామని సలహా ఇస్తాడు.. అంతా అప్పు కావాలి అంటే మనకు ఎవరిస్తారు అని తులసి అంటుంది.. నాకు తెలిసిన ఒక బ్యాంకు మేనేజర్ ఉన్నాడు.. ఆయనను నేను అడుగుతాను అని వాళ్ళ మావయ్య అంటాడు..
లాస్య , భాగ్య మాట్లాడుకుంటుండగా లస్యకు ఒక ఫోన్ వస్తుంది. లాస్య మేడం నేను బ్యాంక్ లోన్స్ చేస్తూ ఉంటాను. మీరు తులసి ఎప్పుడైనా లోన్ తీసుకుంటే మీకు చెప్పమని నాకు డబ్బులు కూడా ఇచ్చారు అని అంటాడు.. ఇప్పుడు తులసి నాకు ఫోన్ చేసి 20 లక్షలు లోన్ కావాలని అడిగారు అని అంటాడు. తులసి కి లోన్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే తనకి సొంత ఇల్లు కూడా లేదు. ఖచ్చితంగా ఈ లోన్ ఆమెకు రాకుండా చేస్తాను అని అంటాడు అతను. కాదు కాదు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి అయినా సరే.. తనకు ఈ లోన్ వచ్చేలా చెయ్యి.. ఆ డాక్యుమెంట్స్ అవసరమైన ఖర్చు నేను ఇస్తాను. ఎలాగైనా వచ్చేలా చేయాలని చెబుతుంది.. లాస్య మాటలు విన్న భాగ్య షాక్ అవుతుంది.
నీకేమైనా పిచ్చా లాస్య.. అని భాగ్య అడుగుతుంది. లోన్ తులసికి వస్తుంది కానీ ఆ డబ్బులు తీసుకునేది మాత్రం నేను. అది ఎలా భాగ్య తన వైపు అమాయకంగా చూస్తుంది. ఆ బ్రోకర్ చేత తులసి దగ్గర నుంచి బ్లాంక్ చెక్ మీద సైన్ తీసుకుంటా.. తన అకౌంట్ లోకి మనీ రాగానే ఆ బ్లాంక్ చెక్ తో నా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటూ అని అంటుంది. లాస్య ప్లాన్ విన్న భాగ్య నువ్వు దొంగలకే గజ దొంగ అని పొగుడుతుంది.
అంకిత గాయత్రి తో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుండగా.. అభి ఇంట్లో నుంచి వెళ్ళకుండా ఇంకొక సారి ఆలోచించమనీ అంటాడు. అంకిత అభీతో నువ్వు నాతో కలిసి ఉండాలి అనుకుంటే నువ్వు కూడా మీ పుట్టింటికి వచ్చేసెయ్ అని అంటుంది. అంకిత తో పాటు అభి రాడు. ఇక అంకిత ఒక్కత్తే తులసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. తులసి తనను ఇంట్లో ఉంచుకోకపోతే అంకిత బయట ఉండటానికే ఇష్టపడతాను కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని కరాఖండిగా చెబుతుంది. తులసి అంకిత ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుంది. గాయత్రి తులసి మీద గొడవ పడటానికి లాస్య, నందు, అభీను తీసుకొని వస్తుంది. లాస్య గాయత్రి తో అలా చూస్తూ ఉండి పోతావే వెళ్లి అంకిత ను తీసుకురా అని అంటుంది.. అంకిత రాను అంటుంది. తను రాకపోతే నాలుగు తగిలించైనా తీసుకురావాలి అని అంటుంది లాస్య. తులసి ఎదురుగా ఒక కర్ర వేసి ఈ తులసి రేఖ దాటి వస్తే కురుక్షేత్రం జరుగుతుందని వార్నింగ్ ఇస్తుంది..