Intinti Gruhalakshmi: అంకిత తన పుట్టింట్లో జరిగే బాధనంతా తులసికి చెబుతుంది.. కానీ తులసి అంకిత తన ఇంట్లో ఉండటానికి ఒప్పుకోదు.. మీరు నా బాధను అర్థం చేసుకోమని చెబుతుంది అంకిత.. నువ్వు ఆ తర్వాత వచ్చే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను అని అంటుంది తులసి.. పుట్టించి నుంచి వచ్చిన ఆడపిల్లను బతిమాలి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించాలి అని అంటుంది తులసి.. కానీ చివరిగా నేను చెప్పే మాట వినండి ఆంటీ అని అంకిత.. మీరు నన్ను ఈ ఇంట్లోకి రమ్మన్నా రాకపోనివ్వక పోయినా పర్లేదు నేను మాత్రం మా పుట్టింటికి వెళ్ళను.. బయట ఎక్కడో ఉంటాను అని అంటుంది.. ఇక అంకిత ఇంట్లో నుంచి వెళ్ళిపోతుండగా.. అనసూయమ్మ కోడలు ఇంట్లో నుంచి వెళ్ళకూడదు.. అలా చేస్తే లక్ష్మి దేవిని అవమానించినట్టే అని అంటుంది.. దివ్య అంకిత ను లోపలికి తీసుకు వెళ్ళమని చెబుతుంది.. తులసి అతి కష్టం మీద జరిగే వన్నీ మౌనంగా చూస్తూ ఉండి పోతుంది..!
నందువల్ల ఇంటి ఓనర్ వచ్చి ఇంకా ఇంటి అద్దె డబ్బులు ఇవ్వలేదు ఏంటి అని అడుగుతాడు.. ఇంకోసారి ఆలస్యం కాకుండా చూసుకోండి.. అయినా అద్దె కట్టలేని మీకు ఎందుకండి ఇంత కాస్ట్లీ ఇల్లు అని అంటాడు.. ఈ మంత్ కి ఎక్స్ క్యూజ్ ఇవ్వండి. నెక్స్ట్ మంత్ నుంచి మీరు రాకుండా నేను మీ దగ్గరికి వచ్చి కట్టేస్తాను అని నందు సర్ది చెప్తాడు. సరే ఈసారి ఓకే నెక్స్ట్ మంత్ నుంచి కరెక్ట్ గా ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.. అంతలో లాస్య వచ్చి నందు నాకు కొంచెం వాటర్ తీసుకురావా అని అడుగుతుంది. నందు చిరాకుగా ఉంటాడు.. ఏమైంది నందు అలా ఉన్నావు అని అడుగుతుంది.. నాకు చాలా చిరాగ్గా ఉంది విసిగించకు అని అంటాడు. అకౌంట్ లో డబ్బులు లేవు జాబ్ లేదు అని విసుకుంటాడు.. ఇప్పుడు ఏమైంది అని అడుగుతుంది లాస్య.. ఇప్పుడే ఇంటి అద్దె ఇవ్వమని ఇంటి ఓనర్ వచ్చి వెళ్ళాడు.. అద్దె డబ్బు కట్టలేని మనం పార్టీలు ఫంక్షన్లు అంటూ అప్పులు చేశామని నందు అరస్తాడు.
నందు అభి కి ఫోన్ చేసి ఫోన్ అంకిత కు ఫోన్ ఇవ్వమని అడుగుతాడు. అంకిత లేదు డాడ్.. బట్టలు సర్దుకొని అత్తారింటికి వెళ్లి పోయింది అని చెబుతాడు అభి.. అంతలో గాయత్రి మనం అనుకున్నది అంతా జరిగిపోయింది అన్నయ్యగారు అని అంటుంది.. వెంటనే లాస్య అందుకే అభీని కాదని అంకిత పేరు మీద ఆస్తి మార్చాలని తులసి పట్టుపట్టింది అని చెబుతుంది.. అయినా అంకిత వెళ్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు అని నందు అడుగుతాడు.. అంకితను అలాగే వదిలేస్తే ఆస్తి మొత్తం తులసి కోసం హారతి కర్పూరం చేస్తుంది.. నీ కూతురు అల్లుడు చేతికి తులసి చిప్ప మిగులుస్తుంది.. ఇప్పుడు మనమంతా సైలెంట్ గా కూర్చొని ఉంటే ఇక అంతే సంగతులు.. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను.. మీరు కూడా రండి అని నందు అంటాడు..
గాయత్రి తులసి వాళ్ళ ఇంటికి వెళుతూ నువ్వు కూడా రా అభి అని అంటుంది. నేను రాను ఆంటీ మీరు వెళ్ళండి అని అంటాడు అభి. అదేంటి అభి నువ్వు వస్తే అంకితను కన్విన్స్ చేయొచ్చు కదా అని అంటాడు. ఆ ఇంట్లో వాళ్లకి నేను ఇష్టం లేదు. నాకు ఆ ఇంటికి రావడం ఇష్టం లేదు. అంకిత ఎన్ని రోజులు ఉంటుందో.. అలా ఉండనివ్వండి.. తనకు రావాలి అని అనుకున్నప్పుడు వస్తుంది.. నేను మాత్రం మా ఇంటికి రాను అని అభి తేల్చి చెప్తాడు..
అంకిత ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది.. అభి కోసం నా పుట్టింటిని కూడా కాదనుకుని వచ్చేసిన నాకు ఇప్పుడు ఎందుకు అభి నన్ను అర్ధం చేసుకోకుండా ఇలా తన పంతం కోసం నన్ను వదిలేస్తున్నాడు అని అంకిత లోలోపల బాధపడుతూ ఉంటుంది. ఇక నా జీవితం ఇంతేనా.. నా లైఫ్ కూడా తులసి అంటీలా మారిపోతుందా.. అని అంకిత ఒంటరిగా బాధపడటం చూసిన దివ్య.. వాళ్ళ తాతయ్య , నానమ్మలను పిలుస్తుంది..