Krishna Mukunda Murari: భవాని కృష్ణ వచ్చేటప్పుడు ఇంట్లోకి రాకుండా అడ్డుపడుతుంది. మాకు ఇష్టం లేని పని ఎందుకు చేస్తున్నావు అని అడుగుతుంది.. మీరంతా ఉన్న కూడా నా బాధ ఎవ్వరికీ చెప్పుకోలేనిది.. ఎవ్వరూ తీర్చలేనిది అనగానే.. అదెంటమ్మ ఇంట్లో ఇంత మంది ఉన్నాం కదా ప్రకాష్, భవాని అంటారు.. మా నాన్న చనిపోయారు ఆ లోటు ఎవ్వరూ తీర్చలేరు అని కృష్ణ అంటుంది.. నేను మా నాన్న కి పితృ తర్పణాలు వదలటానికి వెళ్ళా అని చెబుతుంది..
అది ఏంటి పెళ్లయి పెట్టమని పది రోజుల్లో కూడా కాలేదు. మీ నాన్నకి పుత్రు తరుపున వదలాలి అని చెబితే ఎవరో ఒకరి చేత వదిలించే వాళ్ళం కదా నువ్వే ఎందుకు చేయాలి అని అంటా అంటారు. మీకు చెబితే ఇలా చేస్తారని నేను చెప్పలేదు అని కృష్ణ అంటుంది. నా చేతులతో నేను మా నాన్నకి పితృ తర్పణాలు వదిలాను అని కృష్ణ ఉంటుంది. అయినా సరే నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు. కారణం బలమైనదే అయినా కాబట్టి నిన్ను ఇంట్లోకి రానిస్తాను. ముందుగా పంతులు గారిని తీసుకురండి పరిహారం చెప్పి అది చేసిన తర్వాతే తను ఇంట్లోకి రావాలని భవాని ఆదేశిస్తుంది.. అప్పుడే కృష్ణ వెనకమాల మురారి నిలబడి పంతులు గారిని తీసుకువచ్చాను పెద్దమ్మ అని అంటాడు. ఇక పంతులుగారు ఇల్లంతా శుద్ధి చేసే దేవుడి గది కూడా శుభ్రం చేసి కట్టేలపోయ్యి మీద నైవేద్యం పెట్టి ఆ దేవుడికి సమర్పిస్తే దోషం తొలగిపోతుందని చెబుతారు.. అందరం తలా ఒక చేస్తే త్వరగా అయిపోతుంది అని రేవతి అంటుంది. వద్దు నేను చేస్తాను అని కృష్ణ అంటుంది.
కృష్ణ ఇల్లంతా ఊడ్చి తడిగుడ్డ పెట్టి శుభ్రం చేస్తుంది. ఆ తరువాత స్నానం చేసి దేవుడి గది మొత్తం శుభ్రం చేస్తుంది. ఇక మట్టి కుండలో దేవుడికి నైవేద్యం వండి సమర్పిస్తుంది. ఇక కృష్ణ దేవుడికి దండం పెట్టుకుంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది. కృష్ణ కృష్ణ అంటూ మురారి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇక ఎంతసేపటికి కృష్ణ లెగవకపోవడంతో మురారి తన రూమ్ లోకి కృష్ణుని తీసుకు వెళ్తాడు. అది చూసిన ముకుందా మదిలో మెరుపులాంటి ఐడియా వస్తుంది . కృష్ణ గదిలో నుంచి వస్తున్న మురారి ముకుంద దగ్గరకు వస్తాడు. అప్పుడు తను కూడా కళ్ళు తిరిగిపోయిన పడిపోయినట్లు యాక్ట్ చేస్తుంది . ఇప్పుడు మురారి నన్ను ఎత్తుకొని నా రూమ్ లోకి తీసుకువెళ్తాడు అని ముకుందా అనుకుంటుంది. కానీ మురారి ముకుందను టచ్ కూడా చేయకుండా ఇంట్లో అందర్నీ పిలుస్తాడు. వాళ్ళ నాన్న వాళ్ళే ముకుందాను తీసుకువెళ్లి బెడ్ మీద పడుకోబెడతారు. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఓకేనా అని మురారి ముకుందను పలకరిస్తాడు. నా ప్లాన్ ఫెయిల్ అయిందని ముకుందా మనసులో అనుకుంటుంది.
మురారి కి ఏదో లెటర్ వచ్చిందని ముకుందా ఇస్తుంది. ఆ లెటర్ లో ఏముంది అనగానే మురారిని సస్పెండ్ చేశారని ముకుందా చెబుతుంది. ఈ అడవి పిల్ల అత్తింటికి వచ్చేటప్పుడు సారే చీరలు తీసుకొస్తుంది. కానీ వస్తూ వస్తూ తన దురదృష్టాన్ని కూడా ఇంటికి తీసుకు వచ్చిందని భవాని కృష్ణ పై కోప్పడుతుంది..