Krishnamma: స్టార్ మా లో వరుసగా కొత్త సీరియల్స్ ప్రారంభం కానున్నాయి.. ఇటీవల ఎదలో ఎల్లో ఇంద్రధనస్సు అనే సీరియల్ ప్రోమో విడుదల చేయగా మరో సరికొత్త సీరియల్ ని కూడా ప్రసారం చేయనున్నారు.. స్టార్ మా లో మరో సరికొత్త డైలీ సీరియల్ త్వరలో ప్రారంభం కానుంది.. ఆ సీరియల్ పేరు కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని.. తాజాగా ఈ సీరియల్ ప్రోమో ని విడుదల చేశారు..
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ మైల్ మధు వాయిస్ ఆర్టిస్ట్ తో ఈ సీరియల్ ప్రోమో లాంచ్ చేశారు. ప్రేమ గుడ్డిది అంటారు… మరి చూపు లేని వారికి కూడా ప్రేమించే హక్కు ఉందా అంటే అనే కాన్సెప్ట్ తో ఈ సీరియల్ రానుంది.. ఈ సీరియల్లో గగన్ టెలి షో బ్యానర్ పైన నిర్మిస్తున్నారు బెంగాలీ సీరియల్ అయినా సాంగి బాగి అనే సీరియల్కు రీమేక్ గా ఈ సీరియల్ లాంచ్ చేస్తున్నారు ఈ సీరియల్ ఇదివరకే హిందీ తమిళ కన్నడ భాషలో రీమేక్ చేశారు ప్రస్తుతం తెలుగు భాషలో కూడా లాంచ్ చేస్తున్నారు. ఈ సీరియల్ లో హీరోగా విజయ్ సూర్య నటిస్తున్నారు. విజయ్ సూర్య కన్నడ నటుడు కన్నడలో పలు సీరియల్స్ లో ఇతను నటించాడు. మొట్టమొదటిసారిగా ఈ సీరియల్ తో తెలుగు తెర ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు విజయ్ భాస్కర్..
ఈ సీరియల్ లో హీరోయిన్ గా జాహ్నవి రాజ్ నటిస్తోంది. జాహ్నవి రాజ్ ఒడిస్సా అమ్మాయి. ఈమె గతంలో ఒడియా సీరియల్స్ లో కూడా నటించింది. ఈమె కూడా మొట్టమొదటిసారి తెలుగు సీరియల్స్ తో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఈ సీరియల్ను గగన్ టెలిషో బ్యానర్ పై గుప్తా నిర్మిస్తున్నారు. ఈ సీరియల్ కి ప్రముఖ డైరెక్టర్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సిరివెన్నెల అనే టైటిల్ తో రావాల్సిన ఈ సీరియల్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తున్నారు. రాబోయే ఈ కొత్త సీరియల్ ఏ టైమ్స్ లో ఇస్తారు అనేది తెలియాల్సి ఉంది.