కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్లో శోభ జ్వాలకు నిజాలు చెప్పడంతో శోభ చెంప పగలకొడుతుంది.ఈ క్రమంలోనే జ్వాలకు జ్వరం వచ్చి సృహలో లేకుండా ఉంటే హిమ వచ్చి జ్వాలకు ట్రీట్మెంట్ చేసి ఇంటికి తీసుకుని వెళ్లిపోతుంది హిమ.తెల్లారి లేచి చూసేసరికి జ్వాల సౌందర్య ఇంట్లో ఉంటుంది.ఈరోజు కూడా అదే సీన్ కంటిన్యూ అవుతుంది.జ్వాల లేచి చూసే సరికి టేబుల్ మీద హిమ, జ్వాలల ఫొటో ఉంటుంది.అది చూసి జ్వాల ఒక్కసారిగా షాక్ అవుతుంది.నేనుఏంటి ఇక్కడ ఉన్నాను అని ఆశ్చర్యపోతుంది.ఇక అదే రూమ్లోకి సౌందర్య, ఆనందరావులు వస్తారు.మీరేంటి ఇక్కడా?నేనేంటి ఇక్కడా?’ అంటుంది సౌర్య.
హిమను చూసి షాక్ అయిన జ్వాల:
ఇంతలో హిమ వస్తుంది.నీకు బాలేకపోతే నేనే మీ ఇంటికి తీసుకుని వచ్చాను అంటుంది.వచ్చిన హిమే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అంటాడు ఆనందరావు.ట్రీట్మెంట్ చేసినందుకు రెండింతల ఫీజ్ ముఖాన్ని కొడతాను.ఇప్పుడు నేను వెళ్తాను’ అంటుంది సౌర్య కోపంగా.ఏం మాట్లాడుతున్నావే?ఒక్కసారి హిమ మొహం చూడవే.పాపమే నీకు జ్వరమని రాత్రంతా నిద్రలేకుండా నీ పక్కనే కూర్చుని టెంపరేచర్ చెక్ చేస్తూ.. టాబ్లెట్స్ ఇస్తూ ఎంత టెన్షన్ పడిందో తెలుసా? అదేం డాక్టర్గా సేవలు చేయలేదే తోడపుట్టినదానిలాగా.ఓ తల్లిలా నిన్ను చూసుకుంది అంటుంది సౌందర్య.
సౌందర్య మాట వినని జ్వాల:
జ్వాల మాత్రం నువ్వు తెలివైనదానివి మాటకారివని నాకు బాగా తెలుసు నానమ్మ.నన్ను ఇలా మాటలతోనే ఉంచెయ్యాలని చూస్తున్నారా?అంటుంది సౌర్య కోపంగా.ఏంటమ్మా అయ్యిందేదో అయ్యిందని ఉండొచ్చు కదమ్మా’ అంటాడు ఆనందరావు.తాతయ్యా అయ్యిందేదో అయ్యింది అనుకోవడానికి అది రూపాయి కాదు నా జీవితం. నా ప్రేమ పోయింది.ఇది నన్ను మోసం చేసింది అంటుంది.సౌర్య అసలు జరిగిందటే అంటూ హిమ మాట్లాడుతుంటే‘నువ్వు నోరుముయ్ నాకు కంపరంగా ఉంది’ అని అరుస్తుంది సౌర్య.
కన్నీరు పెట్టుకున్న ఆనందరావు :
కోపాలు పగలు,అనుమానాలు అన్నీ సహజమే కానీ బంధం ఎప్పటికీ నిజం.మీ అమ్మా నాన్నలని పోగొట్టుకుని నువ్వే అంత బాధపడితే వాడు నా కొడుకే,అది నా కోడలే.వాళ్లని పోగొట్టుకుని మేమెంత బాధపడుతున్నామో ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు ఆలోచించవు,ఎప్పుడూ నీవైపే కాదు మా వైపున కూడా ఆలోచించు అని అరుస్తుంది సౌందర్య.మీరు ఎన్ని చెప్పినా నేను వినను.నేను వెళ్తున్నాను అంటూ ఆ గదిలోంచి హాల్లోకి వస్తుంది సౌర్య. వెనుకే ముగ్గురూ వస్తారు.ఆనందరావు సౌర్య చేయి పట్టుకుని ఆపుతాడు.ఒక్క రెండు నిమిషాలు నన్ను మాట్లాడనీయమ్మా అంటాడు.దీప,కార్తీక్ల ఫొటోలు చూపిస్తూ మాట్లాడతాడు.చూడమ్మా రోజులో ఎక్కువ సేపు నేను ఇక్కడే గడుపుతాను ఎప్పుడో తెలుసా?అందరూ నిద్రపోయాక, ఎవ్వరూ ఇంట్లో లేనప్పుడు ఈ ఫొటోల ముందు నిల్చుని వాళ్లని నిన్ను తలుచుకుంటూ ఏం చేశావయ్యా నా మానవరాలిని?ఏం తిందో?ఎలా ఉందో? అని ఏడ్చీ ఏడ్చీ ఏడవడానికి శక్తి లేనప్పుడు అప్పుడు వెళ్లి పడుకుంటానమ్మా అంటాడు ఆనందరావు.
తాతయ్య మాటలకు సౌర్య మనసు కరుగుతుందా..?
అప్పుడు సౌర్య ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ తాతయ్యా అని గట్టిగా హత్తుకుంటుంది.ఆనందరావు కూడా ఏడ్చేస్తాడు.దీనికీ నీకు వంద గొడవలు ఉండొచ్చే.కానీ మధ్యలో మేమేం తప్పు చేశామే?’అంటుంది సౌందర్య ఏడుస్తూ వెళ్లిపోమ్మా వెళ్లిపో దూరంగా ఉండటం నీకు అలవాటు అయ్యిందేమో కానీ దూరం చేసుకోవడం, మరిచిపోవడం మాకు ఇంకా తెలియదమ్మా అంటాడు ఆనందరావుఏడుస్తూ నేను వెళ్తాను.అంటుంది సౌర్య.ఇంత చెప్పినా నీ మనసు కరగలేదా?అంటుంది సౌందర్య. ఏంటి ఉండు అనగానే ఉండిపోవాలా?నా ఆటో తెచ్చుకోవాలి. అలాగే నా లగేజ్ తెచ్చుకోవాలిగా’అంటుంది సౌర్య.ఇక సౌర్య మాటలకి అందరు మురిసిపోతారు.ఇక్కడ ఉన్నాగాని నా బతుకు నాది నా ఆటో నాది అంటుంది సౌర్య.
హిమకు క్యాన్సర్ లేదు అని తెలుసుకున్న స్వప్న :
ఇక సీన్ కట్ చేస్తే స్వప్న దగ్గరకు వచ్చిన శోభ తను తెచ్చిన రిపోర్ట్ స్వప్న చేతిలో పెట్టి ఆంటీ హిమకు క్యాన్సర్ లేదు అనే నిజాన్ని చెబుతుంది.అవి చూసిన స్వప్న షాక్ అయిపోతుంది.ఇక రేపటి ఎపిసోడ్ లో స్వప్న రియాక్షన్ ఏంటి అనేది చూడాలి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!