బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ 546 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు సెప్టెంబర్ 3 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.వసు పరీక్ష రాయలేదేమో అని రిషి పడిన తపన చూస్తే ప్రతి ఒక్కరి కంట్లో నీళ్లు వచ్చేస్తాయి.అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు రిషి. ఎలాగయితేనే వసును కనిపెట్టి పరీక్ష రాయిస్తాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో మొత్తానికి వసుధార ఎలాగైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఓపిక తెచ్చుకొని ఎగ్జామ్ రాస్తుంది.ఒకపక్క రిషి,మరోపక్క జగతి ఇద్దరు కూడా వసును చూసి చాలా సంతోషిస్తారు. ఇక ఎక్సమ్. అయిపోయాక మహేంద్ర వర్మ రిషిని రెస్టు తీసుకోమని చెప్పి అక్కడి నుంచి పంపిస్తాడు.
వసు, రిషి పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేసిన మహేంద్ర :
పరీక్షలు పూర్తయిన తర్వాత జగతి, మహేంద్ర, గౌతమ్ ముగ్గురు రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ వసు లీవ్ అని చెప్పి రాదు. ఇక మహేంద్ర వర్మ జగతితో వసు చాలా తిప్పలు పెట్టింది అని అంటాడు. ఇప్పటికీ తను ఎగ్జామ్ రాస్తుందా లేదా అనే ఆలోచనే మైండ్ లో ఉంది అని అంటాడు. ఇంతకూ తనకు ఏమైంది?ఏమైనా చెప్పిందా అని జగతిని అడుగుతాడు.తెలియదు మహేంద్ర అంటుంది జగతి. ఇక ముగ్గురు కలిసి వసు, రిషిల పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలాగయినా రిషి, వసుల పెళ్లి చేయాలి అని ఫిక్స్ అవుతాడు మహేంద్ర.. అప్పుడే గౌతమ్ కూడా వచ్చి తనకు ఒక ఆలోచన వచ్చింది అని వసు, రిషి లకు మంచి ముహూర్తం చూసి పెళ్లి చేయాలి అని అంటాడు.
సాక్షినే తనను కిడ్నాప్ చేసిందనే నిజం వసు రిషికి చెప్తుందా..?
మరోవైపు వసు పరీక్ష రాసిన ఆనందంలో ఒక బాబుతో ఆడుతుండగా అక్కడికి రిషి వస్తాడు.ఇక సంతోషంలో రిషి చేతులు పట్టుకొని వసు తిరుగుతుంది.హేయ్ వసుదార ఆగు అని రిషి తనను ఆపి ఇంతకీ ఏం జరిగింది.నువ్వు అక్కడ ఎలా ఉన్నావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. దాంతో వసు జరిగిన విషయం గుర్తుకు తెచ్చుకొని సాక్షినే ఇదంతా చేసిందని చెప్పాలా వద్దా అనే ఆలోచనలో పడి మౌనంగా ఉంటుంది.సరే ఈ విషయం గురించి వదిలేయని చెప్పి నిన్ను ఒక చోటకి తీసుకెళ్తాను ఎక్కడికి అని అడగకు అని వసుని తీసుకుని వెళ్తాడు రిషి.
నవ్వుల్లో మునిగితెలుతున్న భూషణ్ కుటుంబం :
ఇక మహేంద్ర వర్మ, జగతి వసు, రిషిల ఫోటోలను ఎడిట్ చేసి పక్కపక్కనే ఉన్న వాళ్ళ ఫోటోలు చూసి మురిసిపోతాడు. అదే సమయంలో ధరణి, గౌతమ్ లు కూడా వచ్చి ఆ సంతోషాన్ని పంచుకుని నవ్వుకుంటూ ఉంటారు.మధ్యలో మహేంద్ర వర్మ దేవయాని గురించి వెటకారం చేసి మాట్లాడంతో వాళ్ళ మాటలు విన్న దేవయాని కోపంతో రగిలిపోతుంది
సాక్షిని తిట్టిన దేవయాని :
మహేంద్ర మాటలు విన్న దేవయాని సాక్షి గురించి ఆలోచిస్తూ ఏ పని సక్రమంగా చేయడం రాదు అంటూ సాక్షిని తిట్టుకుంటుంది. అప్పుడే సాక్షి ఫోన్ చేయడంతో సాక్షిపై అరుస్తుంది.. చేసేపని. సరిగ్గా చేయాలి ఇలా సగం సగం చేస్తే ఎలా. అని. అరుస్తుంది.ఇక సాక్షి తన దగ్గర మరో ప్లాన్ ఉందని, ఆ ప్లాన్ అమలుచేసి వారిద్దరిని దూరం చేస్తాను అని, ఈసారి కచ్చితంగా అదే జరుగుతుంది అని గట్టిగా దేవయానితో అంటుంది.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!