బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ 528 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగష్టు 16 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..గత ఎపిసోడ్లో రిషి, సాక్షీల నిశ్చితార్థకార్యక్రమం మొదలవుతుంది.ఉంగరాలు మార్చుకొండి అని పూజారి చెప్పడంతో రిషి ఉంగరం తీసి సాక్షీకి పెట్టే సమయంలో ఉంగరం చూసి షాక్ అయిపోతుంది. ‘ఏంటిది అంటూ రిషి చేతిలోని ఉంగరం తీసుకుని పైకి లేస్తుంది. ఆ ఉంగరం మీద వి అని ఉండటం చూసి అది అందరికీ చూపిస్తూ.. ‘ఈ అక్షరం ఏంటీ.. వి అని ఉంది?’ అంటూ అరుస్తుంది. వసు షాక్ అయిపోతుంది.
ఎంగేజ్మెంట్ లో సాక్షి రచ్చ :
ఎస్ అని ఉండాల్సిన రింగ్ మీద వి అని ఉండటం ఏంటి అని సాక్షీ తెగ ఆవేశ పడుతూ దేవయానిని నిలదీస్తుంది. దేవయాని సైలెంట్గా ఉంటుంది. రిషి మాత్రం కాస్త తటపటాయిస్తూ అది సారీ సాక్షీ అంటాడు రిషి. ‘సారీనా..? ఏంటి రిషి సారీనా..?కాబోయే భార్యని నా పేరులోని మొదటి అక్షరాన్ని మరిచిపోయావా’ అంటూ ఆవేశపడుతుంది సాక్షి.వసుధార పేరుని మరిచిపోలేక పోతున్నావా?’ అంటుంది సాక్షి. రిషికి కోపం వచ్చి గట్టిగా సాక్షీ అని ఆవేశంగా అరుస్తాడు రిషి. ‘హా రిషీ.. సాక్షీనే ఇప్పుడు గుర్తొచ్చిందా నా పేరు అంటుంది.అమ్మా సాక్షీ ఏంటమ్మా ఇది? ఇలా మాట్లాడటం తప్పు’ అంటారు సాక్షీ తల్లిదండ్రులు. ‘మీరు మధ్యలో మాట్లాడొద్దు అనేస్తుంది సాక్షి. వెంటనే దేవయాని సాక్షికి సద్దిచెప్పే ప్రయత్నం చేస్తుంటే.. ‘ఆంటీ ఇది ఉంగరంలోని అక్షరంతోనే ఆగదు అంటుంది సాక్షి. ‘ఏదో పొరపాటున జరిగింది అని చెబుతున్నాడు కదమ్మా’ అంటాడు ఫణేంద్ర. అంకుల్.. ఇది ఈ రోజుతో అయిపోయే పొరబాటు కాదు. రేపొద్దున్న వసుధార కాఫీ అని, వసు కాలేజ్కి వెళ్తున్నా అంటాడు. ఒకవేళ పిల్లలు పుడితే మీ అమ్మ పేరు వసుధార అని చెబుతాడేమో అని అంటుంది.మనసంతా అదిగో ఆ వసుధార మీదే ఉంది అంటూ ఈ పేరు వింటుంటేనే నాకు కంపరంగా ఉంది అంటుంది. ప్రతిక్షణం నేను తనకి వసుధారలానే కనిపిస్తాను.ఇవన్నీ భరించడం నా వల్ల కాదు.. ఈ పెళ్లి నాకొద్దు’ అంటూ ఉంగారాన్ని విసిరికొడుతుంది.
దేవాయనికి ఎదురుతిరిగిన సాక్షి:
సాక్షీ ఆ మాట అనగానే ఒక్క దేవయాని తప్పా మిగతా అందరు సంతోషిస్తారు.రిషీ నీ గురించి అందరూ అంటుంటే ఏదో అనుకున్నాను.. తల్లిని కాదు అన్నావంటే ఆంటీదే తప్పు అనుకున్నాను. వసుధార నిన్ను ఎందుకు కాదు అనుకుందో పిచ్చిది అనుకున్నాను కానీ ఇప్పుడు తెలిసింది నిన్ను ఎందుకు కాదు అనుకుందో నీకు ప్రేమించడం తెలియదు అలాగే ప్రేమ విలువ తెలియదు అని జగతీ ఆంటీ మీరు సూపర్.. మీరు చెప్పిందే కరెక్ట్..’ అంటుంది సాక్షి. ‘
జగతి ఆంటీనే కరెక్ట్ అన్న సాక్షి :
దేవయాని జగతి మీద ఫైర్ అవుతూ ఏమి చెప్పావ్ అంటూ రెచ్చిపోతుంది ‘ఆంటీ జగతీ ఆంటీ నా మనసు విరగొట్టలేదు.. రిషి మనసులో నువ్వు లేవు అని..ముందు ముందు నీకు ఇది చాలా ప్రాబ్లమ్ అవుతుందని చాలా ముందుగానే చెప్పారు కానీ నేను వినలేదు అంటుంది సాక్షి. ‘పదండి డాడీ మమ్మీ అంటూ అక్కడ నుండి బయలుదేరబోతుంది.సాక్షీ తప్పు చేస్తున్నావ్.. జీవితాంతం బాధపడతావ్’ అంటుంది దేవయాని. ‘సాక్షీ ఏం అయ్యింది నీకు’అంటాడు రిషి. ‘జ్ఞానోదయం అయ్యిందయ్యా.. జ్ఞానోదయం అయ్యింది మిస్టర్ రిషీంద్ర భూషణ్.చీచీ.. ఇంతకాలం నేను ఆరాటపడింది నీకోసమా? లండన్ నుంచి వచ్చి నా టైమ్ వేస్ట్ చేసుకున్నది నీ కోసమా అని ఇది నా ఓటమి కాదు.. నేను గెలిచి వెళ్తున్నాను’ అంటుంది సాక్షి.నోరుముయ్ సాక్షీ.. నీకు ఈ పెళ్లి నచ్చకుంటే వెళ్లిపో అంతే కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దు’ అంటాడు రిషి. ‘నేను ఎందుకు వెళ్తున్నానో నీకు తెలియాలి కదా.. అందుకే ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను..’ అనేసి.. ‘డాడ్ పదండి’ అంటూ తన పేరెంట్స్ని తీసుకుని బయటికి వెళ్లిపోతుంది.
ఎంగేజ్మెంట్ రింగ్ అందుకున్న వసు:
అప్పుడే వసు ఆ కింద పడిన వి అనే ఉంగారాన్ని వసు తీసుకుని చూసుకుంటుంది. ఇక సీన్ కట్ చేస్తే వసు ఇంటికి వెళ్లేందుకు బయటికి వచ్చిన వసు ముందుకు సాక్షి వచ్చి వెటకారంగా మాట్లాడుతుంది..ఇంతలో రిషి అక్కడికి వస్తాడు.‘వసుధారా నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావ్.. రిషిని కాదు అని చాలా మంచి పని చేశావ్’ అంటూ రిషి ముందే రెచ్చగొట్టినట్లు మాట్లాడుతూ మనసులో మాత్రం నాకు దక్కని నువ్వు ఎవరికీ దక్కడానికి వీల్లేదు నీ మీద పగ తీర్చుకుంటా’ అనుకుంటూ వెళ్లిపోతుంది.