బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 534 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో మహేంద్ర ఫ్యామిలీ మొత్తం ఒకే కారులో కలిసి. కాలేజ్ కి వస్తారు. ఇక వసు క్లాస్ కి వెళ్లిన తర్వాత కూడా రింగ్ ఎలా కొనాలి అనే ఆలోచనలో ఉంటుంది. అదే. సీన్ ఈరోజు ఎపిసోడ్ లో కూడా కంటిన్యూ అవుతుంది. రిషి బోర్డ్ మీద ఒక ప్రాబ్లం ఇచ్చి వసును చేయమని అనడంతో వసు వెళ్లి బోర్డు దగ్గర నిలబడి ఇచ్చిన ప్రాబ్లెమ్ సాల్వ్ చేయకుండా బోర్డు మీద బంగారం లెక్కలు వేస్తుంది. దాంతో క్లాస్ వాళ్ళంతా షాక్ అవ్వగా రిషి కూడా ఏం లెక్కలు వేస్తున్నావ్ అని వెళ్లి కూర్చోమంటాడు.
తన డ్రైవింగ్ గురించి గొప్పలు చెప్పుకున్న మహేంద్ర :
సీన్ కట్ చేస్తే జగతి దగ్గర కూర్చున్న మహేంద్ర కారులో జరిగిన సంఘటనను గుర్తుకు చేసుకొని నవ్వుకుంటాడు. అప్పుడే అక్కడికి గౌతమ్ కూడా రావడంతో డ్రైవింగ్ గురించి చెబుతుంటాడు మహేంద్ర.ఆ తర్వాత గౌతమ్ ఇవాళ రిషి మూడ్ ఎలా ఉందో అని అడగగా…జగతి రిషి మూడ్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్ గురించి ఆలోచిస్తుంటాడు అని చెబుతుంది. ఆ సమయంలో వసు అక్కడినుంచి వెళ్తుండగా గౌతమ్ వసును పిలుస్తాడు. వసు పలకకపోయేసరికి వసు దగ్గరకు వెళ్ళొస్తాను అని వెళ్తాడు.
స్టాఫ్ మీటింగ్ లో రిషి ఏమి మాట్లాడాడంటే..?
మీటింగ్ మొదలు అవ్వడంతో మహేంద్ర వర్మ దంపతులు మీటింగుకు వెళ్తారు.మీటింగులో రిషి ఎగ్జామ్ గురించి చెప్పి అందరిని చక్కగా తీర్చిదిద్దాలి అని చెప్పి అందరిని వెళ్ళమని జగతి మేడంను మాత్రం ఉండమని చెప్తాడు.ఇక రిషి జగతితో వసు ఆలోచనల గురించి చెప్పి తను ఏదో విషయం గురించి ఆలోచిస్తుంది అని,ఏంటో లెక్కలు వేస్తుంది అని కూడా చెప్పి తనను పరీక్షల మీద శ్రద్ధ పెట్టించేలా చూడమని అంటాడు. ఆ సమయంలో జగతి సరే సార్ అని అనటంతో.. వెంటనే సార్ అనకండి అన్నా రిషి మాటలు గుర్తొచ్చి సరే రిషి అని అంటుంది.
దేవయాని, సాక్షిల మరొక కుట్ర :
మరోవైపు దేవయాని, సాక్షి ఒకచోట కలుసుకుంటారు. ఇక దేవయాని సాక్షితో తొందర పడ్డావు అని పెళ్లి చేసుకున్న తర్వాత రిషిని నీ వైపు మలుచుకుంటే అయిపోయేది అని అంటుంది. అయిందేదో అయింది అంటూ సాక్షికి ఒక ప్లాన్ చెబుతుంది దేవయాని. సాక్షి కూడా సరే అలాగే అన్నట్టు తలాడిస్తుంది.మరో పక్క వసు కోసం రిషి రెస్టారెంట్లో ఎదురు చూస్తాడు. అక్కడ రెస్టారెంట్ఆ లో వసు కనిపించక పోయేసరికి వసు గురించి అడగగా యజమానిని డబ్బులు అడిగి తీసుకుంది.. ఏమి కష్టం వచ్చిందో ఏమో అంటాడు ఆ వ్యక్తి. ఏమైంది వసుకి అని రిషి ఆలోచనలో పడి వసు దగ్గరికి బయలుదేరుతాడు. ఇక వసు తన రూమ్ లో ఆ రింగు ని చూస్తూ మురిసిపోతూ ఆ రింగుకు దారం కట్టి మెడలో వేసుకోవడంతో ఈరోజు ఎపిసోడ్ పూర్తి అవుతుంది