బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ 529 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈ రోజు ఆగస్టు 18న ప్రసారం కానున్న సీరియల్లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం. రిషి, సాక్షిల ఎంగేజ్మెంట్ ఆగిపోవడంతో గౌతమ్, జగతి, మహేంద్ర అందరు కలిసి రెస్టారెంట్ కు వస్తారు.ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినందుకు కేక్ తో సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటారు. అప్పుడే రిషి, వసు కూడా అనుకోకుండా అదే రెస్టారెంట్ కి రావడంతో వాళ్ళను చూసి అందరు ఆశ్చర్యపోతారు.
అబద్దాలు చెప్పడంలో ఇద్దరు ఇద్దరే:
ఏంటి ఇలా అందరు వచ్చారు అని రిషి అంటే ఎంగేజ్మెంట్ ఆగిపోయింది కదా కేక్ అని అనే లోపు వెంటనే మహేంద్ర వర్మ కేకే రావు అనే నా ఫ్రెండ్ ను కలవడానికి వచ్చాము అని అంటాడు. రిషి ఆ పేరుతో ఉన్న ఫ్రెండ్స్ లేరు కదా అనడంతో ఈ మధ్యనే పరిచయమయ్యాడు అని అంటాడు. మహేంద్ర వర్మ కూడా మీరెందుకు కలుసుకున్నారు రిషి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా దాని గురించి చర్చించుకోవడానికి కలుసుకున్నాము అని అబద్ధం చెబుతాడు.
సీన్ కట్ చేస్తే..
చీకటి పడటంతో దేవయాని తప్ప అందరూ భోజనానికి కూర్చుంటారు. ఇక రిషి పెద్దమ్మ ఎక్కడ అని అడగటంతో ఎందుకో కాస్త డల్ గా ఉంది అని చెప్పడంతో రిషి భోజనం తీసుకొని తన పెద్దమ్మ దగ్గరికి తీసుకుని వెళ్లి తినిపిస్తాడు. సమయంలో జగతి మనసు కాస్త భారంగా అనిపించడంతో ఎమోషనల్ అవుతుంది. తినకుండా అక్కడినుంచి వెళ్ళిపోతుంది.
అమ్మకి అన్నం తీసునిపిస్తున్న రిషి :
ఇక రిషి దేవయానికి అన్నం తినిపిస్తూ ఉంటాడు. ఇక దేవయాని తన మనసులో రిషికి నా మీద చాలా ప్రేమ ఉంది అని కానీ నాది నాటకం అని రిషికి తెలిస్తే నన్ను క్షమించడు అని అనుకుంటుంది. ఇక సాక్షి టాపిక్ తీయడంతో ఆ విషయం గురించి మర్చిపో అని రిషి అంటారు.జగతి వారిని చూసి దేవయాని ప్లేస్ లో తనని ఊహించుకుంటుంది. మహేంద్ర వర్మ వచ్చి త్వరలోనే వదిన బాగోతం బయటపడుతుంది అని కాస్త వెయిట్ చెయ్యి అని అంటాడు.
వసుకు భోజనం పంపిన రిషి:
ఇక గదిలో ఉన్న వసుకు రిషి భోజనం పంపివటంతో వసు ఆశ్చర్య పోతుంది. ఫోన్ చేసి మరి నువ్వు సరిగ్గ అన్నం తినడం లేదు కదా తిను అంటాడు.ఉదయాన్నే రిషి వదిన కాఫీ అనటంతో అక్కడ జగతి ఉంటుంది.ఇక నేను ఇవ్వనా సర్ అని అనటంతో ఇక రిషి మేడం ఇప్పటినుంచి నన్ను రిషి సార్ అని పిలవకండి రిషి అని పిలవండి అంటాడు. దాంతో జగతి ఎంతో సంతోషపడుతుంది. ఆ మాటలు విన్న మహేంద్ర వర్మ కూడా సంతోషపడతాడు.ఇక జగతి కాఫీ తీసుకో రిషి అని ఆనందపడుతూ అనడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.