బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ 529 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది.ఈరోజు ఆగష్టు 15 న ప్రసారం కానున్న గుప్పెడంత మనసు సీరియల్లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..రిషి, వసు ఇద్దరు కూడా ఒకరి గురించి మరొకరు తలుచుకుంటూ బాధ పడుతూ ఉంటారు. అదే సమయంలో రిషి, వసు ఇద్దరు ఎదురెదురు పడతారు. అప్పుడు వారిద్దరు తమ ప్రేమను కోల్పోతున్నాము అన్న బాధలో కనిపిస్తారు. ఆ సమయంలో వారిద్దరు మెట్లు దిగుతుండగా ముందర నడుస్తున్న వసు కింద పడుతుంది. ఆ సమయంలో వసును పట్టుకోగా వసు చేతిలో ఉన్న పూలదండ ఇద్దరి మెడలో పడి ఒకరినొకరు చూసుకుంటారు.
మొదలుకానున్న ఎంగేజ్మెంట్ వేడుక:
ఎంగేజ్మెంట్ వేడుక జరుగుతూ ఉంటుంది. ఇక మహేంద్ర వర్మ మాత్రం రిషి జీవితం ఏమి అవుతుందో అని బాధ పడతాదు.. అసలు ఇలా జరగటం ఏంటి అని జగతితో అంటాడు. ఇక జగతి కాలమే అన్నిటికి సమాధానం చెబుతుంది అని అంటుంది. ఇక రిషి మాత్రం మౌనంగా కనిపిస్తాడు. ఆ తర్వాత సాక్షిని బట్టలు మార్చుకోమని చెప్పటంతో దేవయాని వసుని పిలిచి సాక్షిని రెడీ చేయమని చెబుతుంది.కానీ ధరణి వచ్చి నేనురెడీ చేస్తాను అనడంతో దేవయాని వద్దు వసునే వెళ్తుందని అంటుంది. ఆ తర్వాత వసుయే దగ్గర ఉండి సాక్షిని రెడీ చేయగా సాక్షి తానే గెలిచాను అన్నట్లుగా మాట్లాడుతుంది. అంతేకాకుండా నీకు కూడా ఎవరో ఒకరు దొరుకుతారులే వసు అని కొన్ని సానుభూతి మాటలు మాట్లాడుతుంది. ఇక అక్కడికి జగతి వచ్చి సాక్షిని తీసుకొని వెళుతుంది. మరోవైపు రిషి దేవుడి ముందు నుంచుని తను చేస్తుంది తప్పా,ఒప్పా అనే ఆలోచనలో ఉంటాడు
పెళ్లి చీరలో వసు:
అప్పుడే జగతి సాక్షిని తీసుకొని వస్తుంది. రిషి మాత్రం సాక్షిని చూసి వసు వస్తున్నట్లుగా ఊహించుకుంటాడు. ఎంత బావున్నావ్ ఈ చీరలో వసు అనుకుంటాడు.ఆ తర్వాత సాక్షి రిషి పక్కన నిలబడి దండం పెట్టుకుంటుంది. ఇక మహేంద్ర వర్మ వచ్చి రిషి ని తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత సాక్షి తనే గెలిచాను అన్నట్లుగా జగతి తో మాట్లాడటంతో జగతి మాత్రం భయపడకుండా ధైర్యంగా ఈ ఎంగేజ్మెంట్ జరగదు అనేలా మాట్లాడుతుంది.
అసలు ట్విస్ట్ ఏంటంటే..?
ఆ తర్వాత సాక్షి రిషి దగ్గరికి వెళ్లి నిలబడగా అప్పుడు రిషి కూర్చో వసు అనటంతో అందరూ షాక్ అవుతారు. సాక్షికి కోపం రావడంతో దేవయాని నచ్చజెప్పి కూర్చోబెడుతుంది. ఇక పూజారి ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకోమని అనడంతో రింగును తీసి సాక్షి చెయ్యికి పెట్టబోతాడు.ఆ రింగ్ మీద ఎస్ అని లెటర్ కాకుండా వి అనే లెటర్ ఉండటంతో అది చూసి సాక్షి పెద్ద గొడవ చేస్తుంది. ఇక తన పేరు సాక్షి అని కానీ ఇక్కడ వి అని ఉంది అని అంటుంది. రిషి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!