(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఆర్థికశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గానూ ఈ ఏడాది నోబెల్ పురస్కారం ముగ్గురికి లభించింది. అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డుఫ్లో, మైఖేల్ క్రీమర్ ఈ అవార్డును సంయుక్తంగా అందుకోనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించేందుకు ఈ ముగ్గురూ కలిసి అనేక పరిశోధనలు, ప్రతిపాదనలకు గానూ వీరికి ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ మేరకు నోబెల్ కమిటీ తన ప్రకటనలో స్పష్టం చేసింది. వీరిలో అభిజిత్ బెనర్జీ భారత సంతతికి చెందిన వారు కావడం విశేషం. అంతేకాదు అభిజిత్, ఎస్తేర్ ఇద్దరూ భార్యాభర్తలు.
Watch the announcement of the 2019 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel.
Presented by Göran K. Hansson, Secretary General of The Royal Swedish Academy of Sciences.#NobelPrize pic.twitter.com/M8kqyxvfxq
— The Nobel Prize (@NobelPrize) October 14, 2019
గడిచిన రెండు దశాబ్ధాల్లోనే ఈ ముగ్గురు ప్రతిపాదించిన పరిశోధనా సిద్ధాంతాలు ఆర్థికవ్యవస్థను మార్చేశాయని కమిటీ అభిప్రాయపడింది. పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యేందుకు కావాల్సిన అనేక అంశాలను వారి సిద్ధాంతంలో ప్రతిపాదించినట్లు నోబెల్ కమిటీ చెప్పింది. భారత్ లాంటి దేశంలోనూ వీరు ప్రతిపాదించిన ఆర్థిక సూత్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని నోబెల్ కమిటీ వెల్లడించింది. ఈ ముగ్గురు ఆర్థికవేత్తల ప్రతిపాదన వల్ల సుమారు 50 లక్షల మంది భారతీయ చిన్నారులు లబ్ధి పొందినట్లు కూడా నోబెల్ కమిటీ స్పష్టం చేసింది.
The 2019 Economic Sciences Laureates’ research findings have dramatically improved our ability to fight poverty in practice. As a result of one of their studies, more than 5 million Indian children have benefitted from programmes of remedial tutoring in schools.#NobelPrize
— The Nobel Prize (@NobelPrize) October 14, 2019
కోల్కతాకు చెందిన అభిజిత్ బెనర్జీ జేఎన్యూ, హార్వర్డ్ వర్సిటీల్లో చదువుకున్నారు. 1988లో పీహెచ్డీ చేసిన ఆయన ప్రస్తుతం అమెరికాలోని ఎంఐటీలో ఎకనామిక్స్ ఫ్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన తన భార్య ఎస్తర్తో కలసి పేదరిక నిర్మూలనపై అధ్యయనం చేశారు. ఫ్రాన్స్లో జన్మించి అమెరికాలో స్థిరపడిన ఎస్తేర్ నోబెట్ ఆర్థిక శాస్త్ర బహుమతిని అందుకున్న పిన్నవయస్కుల్లో రెండో వారు. వీరితోపాటు బహుమతికి ఎంపికైన మైఖేల్ క్రెమెర్ అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. ఈ పురస్కారంతో వచ్చే తొమ్మిది మిలియన్ డాలర్లను నగదును ముగ్గురు సమానంగా పంచుకోనున్నారు.
BREAKING NEWS:
The 2019 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel has been awarded to Abhijit Banerjee, Esther Duflo and Michael Kremer “for their experimental approach to alleviating global poverty.”#NobelPrize pic.twitter.com/SuJfPoRe2N— The Nobel Prize (@NobelPrize) October 14, 2019