ఢిల్లీ :దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే బారులు తీరారు.
13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో మూడో దశ పోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఉదయం ఎడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగియనుంది.
117 పార్లమెంటు నియోజకవర్గాల్లో 1,640 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఒడిశా, గుజరాత్, గోవాలో పలు అసెంబ్లి స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి.
గుజరాత్లో 26 లోక్సభ, నాలుగు అసెంబ్లి స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
అలాగే ఒడిశాలో ఆరు లోక్సభ, 42 అసెంబ్లి స్థానాలకు, గోవాలో రెండు లోక్సభ, మూడు అసెంబ్లి స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.
కేరళలో 20, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 14, యూపీలో 10, ఛత్తీస్గఢ్లో ఏడు, బీహార్లో ఐదు, బెంగాల్లో ఐదు, అసోంలో నాలుగు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
జమ్మూకాశ్మీర్, దాద్రానగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, త్రిపురలో ఒక్కో స్థానానికి పోలింగ్ నిర్వహిస్తున్నారు.
జమ్మూకాశ్మీర్ అనంతనాగ్లో బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
మూడో దశ పోలింగ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.