బిజెపిి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా సమక్షంలో పిరాయింపుదారులు
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
గోవాలో బిజెపిలోకి ఫిరాయించిన పది మంది కాంగ్రెస్ శాసనసభ్యులలో ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. శనివారం గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మంత్రివర్గ విస్తరణ చేశారు. నలుగురికి మంత్రివర్గంలో చోటు దొరికింది. వారిలో ముగ్గురు ఫిరాయింపుదారులు. మాజీ ప్రతిపక్ష నాయకుడు చంద్రకాంత్ కావ్లేకర్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కాంగ్రెస్ సభ్యులకు మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు వీలుగా సంకీర్ణంలో భాగస్వామి అయిన గోవా ఫార్వర్డ్ పార్టీ మంత్రులు ముగ్గురినీ, ఒక ఇండిపెండెంట్ మంత్రినీ రాజీనామా చేయాల్సిందిగా ముఖ్యమంత్రి శుక్రవారం కోరారు. అయితే గోవా ఫార్వర్డ్ పార్టీ సభ్యులు ఎదురు తిరిగారు. తాము తప్పుకునేది లేదనీ, కావాలంటే మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేసుకోవచ్చనీ తేల్చిచెప్పారు.